ఏపీలో కరోనా కేసులు అదే స్థాయిలో నమోదు అవుతున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 1337 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఇక తాజా గణాంకాల ప్రకారం…నమోదు అయిన మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య… 20,38,690కి చేరింది. అలాగే ఇందులో 20,09,921 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు.
ప్రస్తుతం 14,699 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో ఏపీలో కరోనాతో 9 మంది మృతి చెందారు. దీనితో మొత్తం కరోనా మరణాల సంఖ్య 14,070కి చేరింది.