ఏపీలో కరోనా కేసుల సంఖ్య అదే స్థాయిలో నమోదు అవుతుంది. తాజాగా గడిచిన 24 గంటల్లో మొత్తం 56,720 శాంపిల్స్ పరీక్షించగా…1,365 కొత్త పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. అలాగే మరో ఎనిమిది మంది కరోనా బాధితులు మృతి చెందారు. మరోవైపు కరోనా నుంచి 1,466 మంది పూర్తిస్థాయిలో కొలుకున్నారు.
Advertisements
ఇక మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 20,42,073కు చేరింది. అలాగే రికవరీ కేసుల సంఖ్య 20,14,180కి చేరింది. ఇప్పటి వరకు మృతిచెందిన కరోనా బాధితుల సంఖ్య 14,097 ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో 13,796 యాక్టివ్ కేసులు ఉన్నాయి.