పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు వరసగా షాక్ లు తగులుతున్నాయి. సొంత పక్షం నుంచి తీవ్ర వ్యతిరేఖత ఎదుర్కొంటున్న ఇమ్రాన్ ఖాన్ సర్కార్.. కూలిపోయేందుకు సిద్ధంగా ఉంది. ఇప్పటికే పాక్ పార్లమెంట్ లో అవిశ్వాస తీర్మాణాన్ని ఎదుర్కొంటున్నాడు.
75 మంది ఎంపీలు, ముగ్గురు మంత్రులు ఇమ్రాన్ సర్కార్ కు మద్దతు ఉపసంహరించుకున్నారు. మరోవైపు ఇమ్రాన్ ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్న మూడు పార్టీలు కూడా ప్రస్తుతం ప్రతిపక్షంతో చేయి కలిపి భారి షాక్ ఇచ్చాయి.
దీంతో పార్టీని ఎలా బలోపేతం చేయాలని సతమతమవుతున్న ఇమ్రాన్ కు అక్కడి ఎన్నికల సంఘం మరో షాక్ ఇచ్చింది. నిబంధనలను ఉల్లంఘించినందుకు రూ.50 వేలు జరిమానా విధించింది. ఇటీవల స్వాత్ లోయలో ఎన్నికల ప్రచారానికి వెళ్లిన ఇమ్రాన్ ఖాన్ నిబంధనలను ఉల్లంఘించారనే ఆరోపణలు ఉన్నాయి.
ఖైబర్ పఖ్తున్వ్కా లో జరిగే స్థానికసంస్థల ఎన్నికల ప్రచారానికి వెళ్లవద్దని ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు అక్కడి ఎన్నికల కమీషన్ నిషేధం విధించింది. వీటిని భేఖాతరు చేస్తూ.. ఇమ్రాన్ ఎన్నికల ప్రచారంలో పాల్గొనడంతో జరిమానా విధించినట్టు అధికారులు వెల్లడించారు.