• Skip to main content
  • Skip to secondary menu
  • Skip to primary sidebar
Latest Telugu Breaking News - Flash News in AP & Telangana

Latest Telugu Breaking News - తొలివెలుగు - Tolivelugu

ToliVelugu News provide Latest Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, TG and AP News Headlines Live (తెలుగు తాజా వార్తలు), Telugu News Online (తెలుగు తాజా వార్తలు)

tolivelugu app - latest telugu news app
tolivelugu facebook tolivelugu twitter tolivelugu instagram tolivelugu tv subscribe nowtolivelugu-app
  • తెలుగు హోమ్
  • వీడియోస్
  • రాజకీయాలు
  • వేడి వేడిగా
  • ఫిలిం నగర్
  • చెప్పండి బాస్
  • ENGLISH

రాంమాధవుడిది మరో మాట

Published on : August 11, 2020 at 12:34 pm


రాష్ట్రంలో బిజెపి ఏపీ నేతలది ఓ స్వరం.. జీవీఎల్, సోము వీర్రాజు బృందానిది మరో స్వరం.. ఇప్పుడు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్ మరో స్వరాన్ని వినిపించారు. అసలు మూడు రాజధానుల కాన్సెప్ట్ నే ఓ జోక్ గా కొట్టిపారేశారాయన. అలాగే.. పెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ కి ఒకటే రాజధాని అయినప్పుడు.. ఇక్కడ మాత్రం మూడు ఎందుకు.. ఇది కేవలం అవినీతికి అవకాశం ఇవ్వడానికే అని తేల్చిపారేశారు. అంతేకాదు.. ఎక్కడా లేనట్లు నామినేషన్ల పర్వంలోనే దౌర్జన్యాలు జరిగిన రాష్ట్రం ఇదే.. ఈసారి మాత్రం మీరు అలాంటి దౌర్జన్యాలను తిప్పికొట్టాలని ఆయన పార్టీ నేతలకు పిలుపునిచ్చారు. మరో మాట కూడా చెప్పారు.. ప్రతి దానికి ఢిల్లీ ఏదో చేయాలని ఎదురు చూడకుండా.. మీరే రాష్ట్రంలో గట్టిగా పోరాడాలి.. వీధుల్లోకి రావాలని.. స్పష్టంగా చెప్పారు.

రాంమాధవ్ చెప్పిన సందేశం.. జీవీఎల్, సోమువీర్రాజు.. గత కొన్నిరోజులుగా మాట్లాడుతున్నదానికి భిన్నంగా ఉంది. జీవీఎల్ లేదా సోము వీర్రాజు.. ఎంతసేపు.. రాష్ట్రం మూడు రాజధానులు పెట్టాలని నిర్ణయించుకుంది.. దానికి మనమేం చేస్తాం.. అమరావతి రైతులకు అన్యాయం జరగకుండా చూస్తాం అన్నారే గాని.. ఎక్కడా మూడు రాజధానులు తప్పుడు కాన్సెప్ట్.. అది అవినీతికి దారి తీస్తుందని కాని.. వైసీపీపై విమర్శలు మాత్రం చేయలేకపోయారు. ఆ విషయంలో చాలా మొహమాటపడ్డారు.
ఇప్పుడు రాంమాధవ్ మాట్లాడినదంతా బిజెపి సైద్ధాంతిక విధానమే. దానినే ఆయన ఉపన్యాసంగా ఇచ్చారు. ఇంతకీ ఆ బిజెపి సైద్ధాంతిక విధానాన్ని అమలు చేయడానికి రాష్ట్రంలోని సోమువీర్రాజు పూనుకుంటారా.. లేక తన రహస్య మిత్రుడు జగన్ నిర్దేశించిన అజెండాను అమలు చేయాలని చూస్తారా అనేది వేచి చూడాలి. అయితే మనం జాగ్రత్తగా గమనిస్తే.. రాంమాధవ్ సైతం.. అమరావతిని తరలించడం తప్పు అని గాని.. అది అన్యాయం అని గాని ఎక్కడా అనలేదు. అమరావతిలోనే రాజధాని ఉంచాలని మనం పోరాడదామనే మాట కూడా చెప్పలేదు. అంటే అటు టీడీపీ నష్టపోవాలి… ఇటు వైసీపీని నష్టపర్చాలి అన్న తీరులో ఆయన చెప్పిన వ్యూహం కనపడుతోంది. అయితే జీవీఎల్, సోము వీర్రాజులు మాత్రం వైసీపీకి లాభం చేయాలనే ధ్యేయంతోనే పని చేస్తున్నట్లు కనపడుతోంది.
బిజెపి స్ట్రాటజీలో విజయవంతమైనది ఒకటే కనపడుతుంది. అది జనసేన. జనసేనను తమ చెప్పుచేతల్లో పెట్టుకోవడంలోను, పవన్ కల్యాణ్ ను తమ డైరెక్షన్ లోనే నడిపించడంలోను సక్సెస్ అయ్యారు.

కమలనాథులు.. అలా ఒక శక్తిని మాత్రం తమ గుప్పిట్లో పెట్టుకోగలిగారు. కాని అమరావతి వ్యవహారంలో తిరకాసు వ్యూహం అమలు చేయటంతో.. టీడీపీని హైజాక్ చేసే అవకాశాన్ని కోల్పోయారనే చెప్పాలి. అదే చేసుంటే… టీడీపీలో నాయకత్వంపై అసమ్మతి ఉన్నవారంతా బిజెపి వైపు రావడానికి అవకాశం ఉండేది. ఇప్పుడు కేవలం జనసేనపై ఆధారపడే.. ముందుకు పోవాల్సిన పరిస్ధితి వచ్చింది. ఇన్ని భిన్న స్వరాలు వినిపిస్తున్న కమలనాథులు.. ఏపీ బీజేపి కార్యకర్తలను కన్ ఫ్యూజన్ లో పడేస్తున్నారనే చెప్పాలి.

tolivelugu app download

Filed Under: రాజకీయాలు

Primary Sidebar

ఫిల్మ్ నగర్

ఇండియా విజయంపై మహేష్ వెంకీలు ఏం ట్వీట్ చేశారో తెలుసా ?

ఇండియా విజయంపై మహేష్ వెంకీలు ఏం ట్వీట్ చేశారో తెలుసా ?

బాలయ్య కు థాంక్స్ చెప్పిన అల్లరి నరేష్

బాలయ్య కు థాంక్స్ చెప్పిన అల్లరి నరేష్

మాస్టర్ ఆ మార్క్ కూడా క్రాస్ చేసిందా ?

మాస్టర్ ఆ మార్క్ కూడా క్రాస్ చేసిందా ?

తలైవి రిలీజ్ ఎప్పుడో తెలుసా ?

తలైవి రిలీజ్ ఎప్పుడో తెలుసా ?

ఆర్ఆర్ఆర్ క్లైమాక్స్ షూట్ స్టార్ట్

ఆర్ఆర్ఆర్ క్లైమాక్స్ షూట్ స్టార్ట్

Advertisement

Download Tolivelugu App Now

tolivelugu app download

అవీ ఇవీ …

ఏపీలో క‌రోనా కొత్త కేసులెన్నంటే...

ఏపీలో క‌రోనా కొత్త కేసులెన్నంటే…

చైనా దురాక్ర‌మ‌ణ‌పై జేపీ న‌డ్డా వ‌ర్సెస్ రాహుల్ గాంధీ

చైనా దురాక్ర‌మ‌ణ‌పై జేపీ న‌డ్డా వ‌ర్సెస్ రాహుల్ గాంధీ

ఇప్ప‌టికీ పేద దేశాల‌కు అందిన వ్యాక్సిన్లు 25 మాత్ర‌మే!

ఇప్ప‌టికీ పేద దేశాల‌కు అందిన వ్యాక్సిన్లు 25 మాత్ర‌మే!

భార‌త్ బ‌యోటెక్ కోవాక్జిన్ కు మ‌రో 45ల‌క్ష‌ల డోసుల ఆర్డ‌ర్

భార‌త్ బ‌యోటెక్ కోవాక్జిన్ కు మ‌రో 45ల‌క్ష‌ల డోసుల ఆర్డ‌ర్

high tension at huzur nagar

ధాన్యం కొనుగోలు చెయ్యనప్పుడు ప్రభుత్వం ఎందుకు ?

Revanth reddy In GHMC Elections campaign

గల్లీ లో కుస్తీలు… ఢిల్లీ లో దోస్తిలా ?

Copyright © 2021 · Tolivelugu.com

About Us | Disclaimer | Contact Us | Feedback | Advertise With Us | Privacy Policy | Sitemap | News Sitemap

ToliVelugu News provide Latest Telugu Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, Telangana and AP News Headlines Live, Latest Telugu News Online (తెలుగు తాజా వార్తలు)