• Skip to main content
  • Skip to secondary menu
  • Skip to primary sidebar
Latest Telugu Breaking News - Flash News in AP & Telangana

Latest Telugu Breaking News - తొలివెలుగు - Tolivelugu

ToliVelugu News provide Latest Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, TG and AP News Headlines Live (తెలుగు తాజా వార్తలు), Telugu News Online (తెలుగు తాజా వార్తలు)

tolivelugu app - latest telugu news app
tolivelugu facebook tolivelugu twitter tolivelugu instagram tolivelugu tv subscribe nowtolivelugu-app
  • తెలుగు హోమ్
  • వీడియోస్
  • రాజకీయాలు
  • వేడి వేడిగా
  • ఫిలిం నగర్
  • చెప్పండి బాస్
  • ENGLISH

జగన్ కి అసలు కన్నా కొసరు టెన్షన్ ఎక్కువైంది

Published on : November 13, 2020 at 7:33 pm

ఈ మధ్య ఒక విషయం గమనించారా.. కోర్టుల మీద, జడ్జిల మీద యుద్ధం ప్రకటించిన వైసీపీ నేతలు జగన్, విజయసాయిరెడ్డిలతో సహా అందరూ సైలెంట్ అయిపోయారు. ఒక్కరంటే ఒక్కరు కూడా కోర్టు ధిక్కార కామెంట్స్ అనేవి చేయటమే లేదు. అటార్నీ జనరల్ లేఖ రాసినా.. ఇంకేం జరిగినా.. ఎవరూ ఏమీ మాట్లాడటం లేదు. కేవలం కొందరు మేధావులతోనే మాట్లాడిస్తున్నారు. ఈ పరిణామానికి కారణమేంటంటే.. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాసి.. మీడియాకు రిలీజ్ చేయడం.. కోర్టు ధిక్కారం కిందకే వస్తుందనే సమాచారం వారికి అందింది. అప్పటి నుంచి టెన్షన్ లో పడ్డారు. ఎందుకంటే కోర్టు ధిక్కారం అని కన్ ఫామ్ చేశారంటే.. ముందు జగన్, విజయసాయిరెడ్డిల బెయిల్ రద్దవుతుంది. జగన్ సీఎం పదవికి.. విజయసాయిరెడ్డి ఎంపీ పదవికి రాజీనామా చేసి జైల్లోకి వెళ్లాల్సిన పరిస్ధితి వస్తుంది. అందుకే వారికి భయం పట్టుకుంది.

ఇప్పుడు నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. రేపో మాపో కోర్టు ధిక్కార పిటిషన్ పై నోటీసులొస్తాయని.. జగన్ సీఎం పదవికి రాజీనామా చేయాల్సి వస్తుందని ఎంపీ అభిప్రాయపడ్డారు. తనకున్న సమాచారం మేరకే పక్కాగా చెబుతున్నానని నొక్కి మరీ చెప్పారు. అంటే ఇప్పుడు జగన్, విజయసాయిరెడ్డిలు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా సుఖం లేదు.. ఆల్రెడీ చేయాల్సిన తప్పులు చేసేశారు. వాటికి మూల్యం చెల్లించుకోవాల్సిందేనన్న కామెంట్లు వినపడుతున్నాయి. అందుకే పోలవరం గాని,, ఇంకో విషయం గాని.. అన్నిటిలోనూ కేంద్రం ఏం చెబితే దానికి తలూపుతూ.. తమకు మాత్రం కోర్టుల నుంచి సమస్య లేకుండా చూడమని వేడుకుంటున్నట్లు సమాచారం.

అటార్నీ జనరల్ కెకె వేణుగోపాల్ లేఖ రాసిన రోజు నుంచి ఈ మార్పు బాగా కనపడుతోంది. వేణుగోపాల్ చాలా స్పష్టంగా కొన్ని విషయాలు చెప్పారు. అసలైతే లేఖ రాయడం తప్పు కాదు.. కాని లేఖను మీడియాకు రిలీజ్ చేయడం మాత్రం కోర్టు ధిక్కారమని చాలామంది భావించారు. కాని లేఖలో రాసిన విషయాలను చదివితే.. లేఖ సైతం కోర్టు ధిక్కారం కిందే వస్తుందని వేణుగోపాల్ తన లేఖలో క్లారిటీ ఇచ్చారు. దానిపై జగన్ అండ్ కో న్యాయనిపుణులను సంప్రదించగా.. అది నిజమేనని వారికి తేలినట్లు చెప్పుకుంటున్నారు. అందుకే అప్పటి నుంచే కోర్టులపై గమ్ముగా ఉండిపోతున్నారు.

ఇప్పుడు రఘురామకృష్ణంరాజు చెప్పిన దానిని బట్టి.. ఆ పరిణామం కూడా జరగబోతుందా అనే అనుమానాలు వస్తున్నాయి. పైగా మొన్నటికి మొన్న జగన్ నంద్యాల సలామ్ కేసు విషయంలో మాట్లాడుతూ.. తెలుగుదేశం వాళ్లకి కోర్టులపై ఉన్న పలుకుబడి తమకు లేదంటూ కామెంట్ చేశారు. ఇది కూడా వాస్తవానికి కోర్టు ధిక్కారం కిందే వస్తుంది. రఘురామ చెప్పారంటే.. దానికి లాజిక్ ఉండే ఉంటుంది. ఎందుకంటే జంధ్యాల రవిశంకరే రఘురామరాజుకి న్యాయ సలహాదారుడు. ఆయన చెప్పందే.. ఈయన బయట నోరు విప్పరు. జంధ్యాల రవిశంకర్ అభిప్రాయాన్నే రఘురామరాజు చెప్పారనుకుంటున్నారు. అదే అయితే.. అది పక్కా జరగబోయే పరిణామమే అనుకోవాలి.

మరి అదే జరిగితే.. సీఎం జగన్.. ఎప్పుడో రోజువారీ విచారణ పూర్తయిపోయి.. శిక్ష పడి జైలుకెళతాననే టెన్షన్ నుంచి.. ముందు ఇప్పుడెలా అనే టెన్షన్ ఎక్కువైపోయింది. ముందు బెయిల్ రద్దు నుంచి తప్పించుకోవడమెలా అనేదానిపైనే ఇప్పుడు జగన్, విజయసాయిరెడ్డి కేంద్రీకరించినట్లు చెప్పుకుంటున్నారు.

tolivelugu app download

Filed Under: రాజకీయాలు

Primary Sidebar

ఫిల్మ్ నగర్

శ్రీ‌క‌రం టైటిల్ సాంగ్ ఎలా ఉందంటే...

శ్రీ‌క‌రం టైటిల్ సాంగ్ ఎలా ఉందంటే…

నితిన్ చెక్ మూవీ రివ్యూ

నితిన్ చెక్ మూవీ రివ్యూ

పవన్ కళ్యాణ్ లుక్ లీక్...పాపం క్రిష్

పవన్ కళ్యాణ్ లుక్ లీక్…పాపం క్రిష్

సమంత 11 ఏళ్ల ప్రయాణం....గుణ టీమ్ స్పెషల్ విషెస్

సమంత 11 ఏళ్ల ప్రయాణం….గుణ టీమ్ స్పెషల్ విషెస్

శ్రీదేవి తర్వాత నేనే...కంగనా రనౌత్

శ్రీదేవి తర్వాత నేనే…కంగనా రనౌత్

Advertisement

Download Tolivelugu App Now

tolivelugu app download

అవీ ఇవీ …

Revanth reddy On BJP Party

ఈ ప్రశ్నలకు బదులు ఉందా కేటీఆర్?- రేవంత్ రెడ్డి

ఫ‌స్ట్ టైం.. ఆ ఇద్ద‌రూ లేకుండా అసెంబ్లీ ఎన్నిక‌లు!

ఫ‌స్ట్ టైం.. ఆ ఇద్ద‌రూ లేకుండా అసెంబ్లీ ఎన్నిక‌లు!

ఎమ్మెల్సీ ఎన్నిక‌లు- జిల్లాకో మంత్రిని ఇంచార్జ్ వేసిన సీఎం కేసీఆర్

ఎమ్మెల్సీ ఎన్నిక‌లు- జిల్లాకో మంత్రిని ఇంచార్జ్ వేసిన సీఎం కేసీఆర్

లాయ‌ర్ల హ‌త్య‌- సీబీఐ విచార‌ణ చేయాలంటూ పిటిష‌న్

లాయ‌ర్ల హ‌త్య‌- సీబీఐ విచార‌ణ చేయాలంటూ పిటిష‌న్

ఎన్నిక‌ల షెడ్యూల్‌కు ముందు.. అన్నాడీఎంకే స‌ర్కార్ సంచల‌న ప్ర‌క‌ట‌న‌

ఎన్నిక‌ల షెడ్యూల్‌కు ముందు.. అన్నాడీఎంకే స‌ర్కార్ సంచల‌న ప్ర‌క‌ట‌న‌

ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నిక‌ల షెడ్యూల్ ఇదే

ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నిక‌ల షెడ్యూల్ ఇదే

Copyright © 2021 · Tolivelugu.com

About Us | Disclaimer | Contact Us | Feedback | Advertise With Us | Privacy Policy | Sitemap | News Sitemap

ToliVelugu News provide Latest Telugu Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, Telangana and AP News Headlines Live, Latest Telugu News Online (తెలుగు తాజా వార్తలు)