• Skip to main content
  • Skip to secondary menu
  • Skip to primary sidebar
tolivelugu-logo-removebg-preview

Tolivelugu తొలివెలుగు

Tolivelugu News provide Latest Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, TG and AP News Headlines Live (తెలుగు తాజా వార్తలు), Telugu News Online (తెలుగు తాజా వార్తలు)

tolivelugu facebook tolivelugu twitter tolivelugu instagram tolivelugu tv subscribe nowtolivelugu-app
  • తెలుగు హోమ్
  • వీడియోస్
  • రాజకీయాలు
  • వేడి వేడిగా
  • ఫిలిం నగర్
  • E-Daily
  • చెప్పండి బాస్
  • ENGLISH
Tolivelugu Latest Telugu Breaking News » Local News » అమిత్‌ షాతో ముగిసిన ఏపీ సీఎం భేటీ!!

అమిత్‌ షాతో ముగిసిన ఏపీ సీఎం భేటీ!!

Last Updated: December 29, 2022 at 2:32 pm

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో ఏపీ సీఎం వైఎస్ జగన్ గురువారం నాడు ఉదయం భేటీ అయ్యారు. బుధవారం నాడు రాత్రి కేంద్ర హోంశాఖ మంత్రితో జగన్ భేటీ కావాల్సి ఉంది. అయితే కొన్ని కారణాలతో అమిత్ షాతో భేటీ ఇవాళ ఉదయానికి వాయిదా పడింది. రాష్ట్రానికి చెందిన పలు అంశాలపై జగన్ కేంద్ర మంత్రి అమిత్ షా తో చర్చించినట్లు తెలుస్తోంది.

విభజన అంశాలు తెలంగాణ, ఏపీ మధ్య ఇంకా అపరిష్కతంగా ఉన్న విషయాలను సీఎం కేంద్ర మంత్రికి వివరించారు. రెండు రాష్ట్రాల మధ్య విభజన పూర్తి కాని సంస్థలు, అప్పులు, ఆస్తుల విసయాన్ని పరిష్కరించాలని జగన్ కోరారు. ఇప్పటికే తెలంగాణ నుండి విద్యుత్ బకాయిల పెండింగ్ అంశాన్ని ప్రధాని వద్ద సీఎం ప్రస్తావించారు. రెండు రాష్ట్రాల మధ్య అపరిష్కృతంగా ఉన్న సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ కేంద్ర మంత్రిని కోరారు.

ఏపీ పునర్విబజన చట్టం 2014 తో పాటు రాష్ట్రానికి రావాల్సిన నిధులు, తెలంగాణ రాష్ట్రం నుండి విడుదల కావాల్సిన బకాయిల వంటి అంశాలపై ఏపీ సీఎం వైఎస్ జగన్ కేంద్ర మంత్రి అమిత్ షాతో చర్చించారు. ఈ నెల 27వ తేదీ రాత్రి ఏపీ సీఎం వైఎస్ జగన్ న్యూఢిల్లీకి వచ్చారు. నిన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో 45 నిమిషాల పాటు భేటీ అయ్యారు. రాష్ట్రానికి సంబందించిన పలు అంశాలపై సీఎం జగన్ చర్చించారు. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి పెండింగ్ నిధులతో పాటు సవరించిన అంచనాల ఖరారు, నిర్వాసితులకు పరిహారం వంటి అంశాలపై ప్రధాని మోడీతో సీఎం జగన్ చర్చించారు.

తెలంగాణ రాష్ట్రం నుండి విడుదల కావాల్సిన నిధుల విషయంలో కేంద్రం జోక్యం చేసుకోవాలని కూడా సీఎం కోరారు. విద్యుత్ బకాయిల విషయంలో తెలంగాణ ప్రభుత్వం నిధులను విడుదల చేయకుండా జాప్యం చేస్తున్న విషయాన్ని ఆయన ప్రస్తావించారు. ప్రధానితో భేటీ తర్వాత ఏపీ సీఎం వైఎస్ జగన్ కేంద్ర పర్యావరణ, అటవీ శాఖమంత్రి భూపేంద్ర యాదవ్ తో సమావేశమయ్యారు. రాష్ట్రంలో నిర్మిస్తున్న ప్రాజెక్టులకు సంబంధించిన అనుమతుల విషయమై చర్చించారు.

Primary Sidebar

తాజా వార్తలు

కే విశ్వనాథ్ ఖాకీ డ్రెస్సు వెనుక స్టోరీ ఏంటంటే?

వరంగల్‌ లో భారీ అగ్ని ప్రమాదం..కోటి రూపాయల నష్టం!

పరుపులను ఫలహారంగా తింటున్న అమెరికా అమ్మాయి…!

కార్యకర్తలే మా సంపద!

నా గొంతు ఆగాలంటే..నన్ను ఎన్ కౌంటర్ చేయించండి!

కళాతపస్వికి మోడీ నివాళులు!

పార్లమెంట్ ఉభయ సభలు వాయిదా…!

ఆ లేఖ నకిలీది… క్లారిటీ ఇచ్చిన మాజీ సీఎం…!

శంకరాభరణం విడుదలైన రోజే.. విశ్వనాథ్‌ కన్నుమూత!

అగ్ని ప్రమాదం పై నిజనిర్ధారణకు అఖిలపక్ష బృందాన్ని అనుమతించాలి!

యాదాద్రీశ్వరుడిని దర్శించుకున్న గవర్నర్

కళాతపస్వికి ప్రముఖుల నివాళులు!

ఫిల్మ్ నగర్

కే విశ్వనాథ్ ఖాకీ డ్రెస్సు వెనుక స్టోరీ ఏంటంటే?

కే విశ్వనాథ్ ఖాకీ డ్రెస్సు వెనుక స్టోరీ ఏంటంటే?

కళాతపస్వికి మోడీ నివాళులు!

కళాతపస్వికి మోడీ నివాళులు!

శంకరాభరణం విడుదలైన రోజే.. విశ్వనాథ్‌ కన్నుమూత!

శంకరాభరణం విడుదలైన రోజే.. విశ్వనాథ్‌ కన్నుమూత!

కళాతపస్వికి ప్రముఖుల నివాళులు!

కళాతపస్వికి ప్రముఖుల నివాళులు!

కళాతపస్వికి ''ఎస్‌'' అనే సెంటిమెంట్‌ ఎందుకంటే!

కళాతపస్వికి ”ఎస్‌” అనే సెంటిమెంట్‌ ఎందుకంటే!

టాలీవుడ్ లో విషాదం.. కళాతపస్వి విశ్వనాథ్ కన్నుమూత!

టాలీవుడ్ లో విషాదం.. కళాతపస్వి విశ్వనాథ్ కన్నుమూత!

నటి పాకీజా, కెమెరా మేన్ దేవరాజ్ లకు చిరంజీవి ఆపన్న హస్తం..!

నటి పాకీజా, కెమెరా మేన్ దేవరాజ్ లకు చిరంజీవి ఆపన్న హస్తం..!

ఫోటోలు పెట్టింది.. ట్రోలర్స్‌కి చిక్కింది!

ఫోటోలు పెట్టింది.. ట్రోలర్స్‌కి చిక్కింది!

Download Tolivelugu App Now

tolivelugu app download

Copyright © 2023 · Tolivelugu.com

About Us | Disclaimer | Contact Us | Feedback | Advertise With Us | Privacy Policy | Sitemap | News Sitemap