ఏపీ సీఎం జగన్ నేడు ఢిల్లీ వెళ్తున్నారు. మధ్యాహ్నం అమరావతి నుంచి బయల్దేరి సాయంత్రానికి హస్తిన చేరుకుంటారు. పర్యటనలో భాగంగా పలువురు కేంద్రమంత్రులతో ఆయన భేటీ అయ్యే అవకాశముంది. ముఖ్యంగా కేంద్ర హోంమంత్రి అమిత్షాతో సీఎం భేటీ కానున్నట్లు తెలుస్తోంది. అయితే మొన్నటి సీఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటనకు కేంద్రం ఊహించని విధంగా ప్రాధాన్యత ఇచ్చింది. అయన అడిగిన వెంటనే కేంద్ర మంత్రులు అపాయింట్మెంట్లు ఇచ్చారు. జగన్ కు ఢిల్లీ ఇస్తున్న ప్రాధాన్యతపై ఇప్పటికే ఆ పార్టీ కొంత అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఈ క్రమంలో మరోసారి జగన్ ఢిల్లీ వెళ్తుండటం ఆసక్తికరంగా మారింది.
కాగా, పర్యటనలో పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన అంశాలతో పాటు రాష్ట్ర పునర్విభజన చట్టంలో అపరిష్కృతంగా ఉన్న సమస్యల పరిష్కారం, రాష్ట్రానికి చెందిన ఇతర అంశాలను జగన్ మరోసారి కేంద్రం దృష్టికి తీసుకువెళతారని అధికార వర్గాలు చెప్తున్నాయి.