రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కలిసి కేంద్రంలో మోడీ-షా ద్వయాన్ని ఎలా ఎదుర్కోవాలనే వ్యూహంపై చర్చించారని ప్రింట్, వెబ్, బ్రాడ్కాస్ట్ మీడియాలో వచ్చిన వార్తలపై ఏపీ సీఎంవో కార్యాలయం స్పందించింది. ‘అబ్బే.. అక్కడ అలాంటిదేమీ లేదే’ అంటూ ఒక ప్రకటన విడుదల చేసింది. టెలివిజన్ మీడియా కోసం అనేట్టుగా స్క్రోలింగ్స్ మాదిరి రిలీజ్ చేసిన ఈ ప్రకటన సారాంశం ఇది…
కేంద్రంపై ఇద్దరు ముఖ్యమంత్రుల అసంతృప్తి అంటూ ఈనాడు దినపత్రిక కథనం కల్పితం: ఏపీ ముఖ్యమంత్రి కార్యాలయం
ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రుల సమావేశంలో అలాంటి అంశం ఏదీ ప్రస్తావనకు రాలేదు: ఏపీ ముఖ్యమంత్రి కార్యాలయం
ఊహాజనిత అంశాలు రాసి ప్రజలను తప్పుదోవ పట్టించవద్దు : ఏపీ ముఖ్యమంత్రి కార్యాలయం
ఈనాడు దినపత్రిక కథనాన్ని ఖండిస్తున్నాం, ఉద్దేశపూర్వకంగా రాసిన కథనంగా భావిస్తున్నాం : ఏపీ ముఖ్యమంత్రి కార్యాలయం
ఇరురాష్ట్రాల ప్రజల ప్రయోజనాల లక్ష్యంగా ఈ సమావేశం సాగింది: ఏపీ ముఖ్య మంత్రి కార్యాలయం
గత నాలుగు నెలలుగా ఉభయ రాష్ట్రాల ప్రయోజనాల లక్ష్యంగా ఇరువురు ముఖ్యమంత్రుల మధ్య సమావేశాలు జరుగుతున్న విషయం అందరికీ తెలిసిందే: ఏపీ ముఖ్యమంత్రి కార్యాలయం
రాజకీయ అంశాలు, రాజకీయ సమీకరణాలకు దూరంగా ఈ సమావేశాలు జరుగుతున్న విషయం అందరికీ తెలిసిందే: ఏపీ ముఖ్యమంత్రి కార్యాలయం
గోదావరి జలాలను తరలింపుద్వారా సాగర్ కుడికాల్వ కింద ఉన్న కృష్ణాడెల్టా, ప్రకాశం సహా రాయలసీమకూ, తెలంగాణలోని పాత మహబూబ్నగర్, రంగారెడ్డి, నల్గొండ జిల్లాలకు మేలు చేకూర్చే అంశంపై సుదీర్ఘ చర్చలు జరిగాయి: ఏపీ ముఖ్యమంత్రి కార్యాలయం
ఈ ప్రాజెక్టును సఫలం చేసే దిశగా నిశితంగా ఇద్దరు ముఖ్యమంత్రులు చర్చించారు: ఏపీ ముఖ్యమంత్రి కార్యాలయం
అపరిష్కృతంగా ఉన్న విభజన అంశాలను కూడా రెండు రాష్ట్రాల మఖ్యంత్రులు చర్చించారు: ఏపీ ముఖ్యమంత్రి కార్యాలయం
పోలీసు అధికారులకు సంబంధించిన విభజన అంశాలను చర్చించారు: ఏపీ ముఖ్యమంత్రి కార్యాలయం
తెలంగాణలో కొత్తగా నియామకం అవుతున్న పోలీస్కానిస్టేబుళ్లకు ఏపీలోకూడా శిక్షణ ఇచ్చే అంశంపైనా చర్చ జరిగింది: ఏపీ ముఖ్యమంత్రి కార్యాలయం
విద్యుత్ ఉద్యోగుల సమస్యలపైనా ఇద్దరు ముఖ్యమంత్రులు దృష్టిపెట్టారు: ఏపీ ముఖ్యమంత్రి కార్యాలయం
నిన్నటి సమావేశంలో రెండు రాష్ట్రాలకు సంబంధించిన అంశాలు తప్ప మరే ఇతర విషయాలూ చోటు చేసుకోలేదు: ఏపీ ముఖ్యమంత్రి కార్యాలయం
ఇలాంటి సమావేశంమీద ఊహాజనిత అంశాలు రాసి ప్రజలను తప్పుదోవపట్టించడం దురదృష్టకరం: ఏపీ ముఖ్యమంత్రి కార్యాలయం
ఇలాంటి కథనాలను తీవ్రంగా ఖండిస్తున్నాం : ఏపీ ముఖ్యమంత్రి కార్యాలయం