తులసి రెడ్డి, ఏపీ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్
ఎయిడెడ్ పాఠశాలల విషయంలో ఏపీ ప్రభుత్వం స్వార్ధబుద్దితో వ్యవహరిస్తోంది. ఎయిడెడ్ విద్యాసంస్థల ఆస్తుల విలువ పెరగడం వల్లే ప్రభుత్వం వాటిపై కన్నేసింది ఎంతో మందికి ఉత్తమ విద్యను అందించి ఉన్నత స్థాయికి చేర్చిన చరిత్ర ఎయిడెడ్ పాఠశాలలకు ఉంది. తక్షణం ప్రభుత్వం ఎయిడెడ్ పాఠశాలల విషయంలో తన నిర్ణయాన్ని మార్చుకోవాలి
కర్ణాటకలో కరోనా థర్డ్ వేవ్ కేసులు నమోదవుతున్నాయి. ఏపీ ప్రభుత్వం ఈ నెల 16 నుంచి ప్రభుత్వం పాఠశాలలను ప్రారంభించాలని చూస్తోంది. కాబట్టి పాఠశాలల నిర్వహణ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి . లేదంటే భారీ ఇబ్బందులు తప్పవు. ఏది జరిగినా ప్రభుత్వానిదే బాధ్యత.