ఏపీలో కరోనా కేసుల సంఖ్య అదే స్థాయిలో నమోదు అవుతుంది. తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 55,323 శాంపిల్స్ను పరీక్షించగా 1,246 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇక తాజా గణాంకాల ప్రకారం మొత్తం కరోనా కేసుల సంఖ్య 20,44,490 కి చేరింది. అలాగే ఇందులో 20,16,837 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు.
ఇక గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,450 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ఇక రాష్ట్రంలో ప్రస్తుతం 13,535 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. అలాగే గడిచిన 24 గంటల్లో కొత్తగా 10 మంది మృతి చెందారు. ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్లో నమోదైన మొత్తం కరోనా మరణాల సంఖ్య 14,118 కి చేరింది.