• Skip to main content
  • Skip to secondary menu
  • Skip to primary sidebar
Tolivelugu తొలివెలుగు – Latest Telugu Breaking News

Tolivelugu తొలివెలుగు - Latest Telugu Breaking News

Tolivelugu News provide Latest Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, TG and AP News Headlines Live (తెలుగు తాజా వార్తలు), Telugu News Online (తెలుగు తాజా వార్తలు)

tolivelugu facebook tolivelugu twitter tolivelugu instagram tolivelugu tv subscribe nowtolivelugu-app
  • తెలుగు హోమ్
  • వీడియోస్
  • రాజకీయాలు
  • వేడి వేడిగా
  • ఫిలిం నగర్
  • E-Daily
  • చెప్పండి బాస్
  • ENGLISH
Tolivelugu Latest Telugu Breaking News » Local News » Andhra Pradesh » కారుణ్య నియామకాలకు ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ

కారుణ్య నియామకాలకు ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ

Last Updated: January 19, 2022 at 4:24 pm

కరోనా కారణంగా అనేక మంది ప్రాణాలను కోల్పోయారు. మృతుల కుటుంబాలకు నష్ట పరిహారం అందించాలని సుప్రీంకోర్ట్ ఆదేశించింది. దానికి తోడు ఏపీ ప్రభుత్వం కరోనాతో మరణించిన ఉద్యోగుల కుటుంబాలకు చల్లని వార్త చెప్పింది. కారుణ్య నియామకాలు చేస్తున్నట్టు ప్రకటించింది. అందుకు సంబందించిన జాబితాను విడుదల చేసింది.

క‌రోనా వైరస్ సోకి మృతి చెందిన ప్రభుత్వ ఉద్యోగుల‌ కుటుంబాల‌కు కారుణ్య నియామ‌కాల‌ను వ‌ర్తింప‌చేయ‌డానికి ఏపీ ప్రభుత్వం అనుమ‌తులు జారీ చేసింది. అయితే ఈ కారుణ్య నియామ‌కాల వ‌ర్తింపు ప్రభుత్వ ఉద్యోగులు, ఫ్రంట్ లైన్ వ‌ర్కర్ల కుటుంబ స‌భ్యుల‌కే ఉంటుంద‌ని ప్రభుత్వం స్పష్టం చేసింది. మృతి చెందిన ఉద్యోగుల కుటుంబాల్లో ఒకరికి జూన్ 30లోగా ఉద్యోగం కల్పించనున్నట్టు సాధారణ పరిపాలన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శశిభూషణ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.

కాగా.. మృతి చెందిన ఉద్యోగి నిర్వహించిన పోస్టుకు సమానమైన ఉద్యోగం లేదా అంతకంటే తక్కువ స్థాయి హోదాతో కారుణ్య నియామకం చేపట్టనున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. కరోనా ప్రత్యేక పరిస్థితుల కారణంగా కారుణ్య నియామకాలను గత ఏడాది నవంబరు 30లోగా చేపట్టాలని నిర్ణయించినప్పటికీ.. పెద్ద మొత్తంలో దరఖాస్తులు పెండింగ్‌ లో ఉన్నాయి.

వీలైనంత తొందరగా వీటిని పరిష్కరించేందుకు గ్రామ, వార్డు సచివాలయాల్లోని ఖాళీల్లో అర్హులైన వారికి కారుణ్య నియామకం ఇవ్వనున్నారు. దీనికి సంబంధించి దరఖాస్తులను పరిష్కరించి తక్షణమే ఖాళీలను భర్తీ చేయాలని కలెక్టర్లకు ప్రభుత్వం ఆదేశించింది. విధినిర్వహణలో ఉంటూ వైరస్ కారణంగా మృతి చెందిన ప్రతీ ఉద్యోగి కుటుంబానికి ప్రభుత్వం ఎల్లప్పుడు అండగా ఉంటుందని సీఎం జగన్ అన్నారు.

tolivelugu news - follow on google news
tolivelugu app download


Primary Sidebar

తాజా వార్తలు

మంకీ పాక్స్ కలకలం..అప్రమత్తమైన రాష్ట్ర సర్కార్

వంద శాతం పెరిగిన నకలి నోట్ల ముద్రణ… ఆర్బీఐ నివేదిక

జైలు జీవితం తర్వాత మంచం మీద పడుకుంటే వింతగా అనిపించింది

విమానం ఆచూకీ గల్లంతు… !

ప‌ర్టిలైజ‌ర్స్ లో ఉత్ప‌త్తులు నిలిపివేయండి.. పీసీబీ ఉత్త‌ర్వులు..!

నెంబర్ వన్ హీరో

అప్పులు చేస్తాం.. వివరాలు చెప్పం!

చేతగాని ముఖ్యమంత్రి అవసరమా?

పంబన్ బ్రిడ్జి.. కొత్త అంగుల‌తో నిర్మాణం..!

కరోనా భారత్ లోనే పుట్టింది.. శ్రీరాముడి జన్మస్థలం నేపాల్..!

పోడు రైతులకు పట్టాలు ఎక్కడ?

ర‌ష్యా ఆధీనంలో.. ఉక్రెయిన్ కీల‌క ప్రాంతం..!

ఫిల్మ్ నగర్

భారీ న‌ష్టాల్లో.. కంగనా సినిమా..!

భారీ న‌ష్టాల్లో.. కంగనా సినిమా..!

kgf 2 dialogues

రాకీబాయ్ లా మారాడు.. ఆస్పత్రిలో చేరాడు!

సావర్కర్ బయోపిక్... అదిరిపోయిన ఫస్ట్ లుక్..!

సావర్కర్ బయోపిక్… అదిరిపోయిన ఫస్ట్ లుక్..!

అర్జున్ రెడ్డి.. త్వ‌ర‌లో రెండ‌వ భాగం..!

అర్జున్ రెడ్డి.. త్వ‌ర‌లో రెండ‌వ భాగం..!

డ్రెస్ తో తంటాలు.. ఇమేజ్ ఢమాల్..!

డ్రెస్ తో తంటాలు.. ఇమేజ్ ఢమాల్..!

ఒక్క విమర్శ తట్టుకోలేవా రావిపూడి!

ఒక్క విమర్శ తట్టుకోలేవా రావిపూడి!

త్రివిక్రమ్ ను నన్ను ఎవ్వరూ విడదీయలేరు

త్రివిక్రమ్ ను నన్ను ఎవ్వరూ విడదీయలేరు

కరోనా తర్వాత అతి తక్కువ టికెట్ రేట్లు ఇవే

కరోనా తర్వాత అతి తక్కువ టికెట్ రేట్లు ఇవే

Download Tolivelugu App Now

tolivelugu app download

Copyright © 2022 · Tolivelugu.com

About Us | Disclaimer | Contact Us | Feedback | Advertise With Us | Privacy Policy | Sitemap | News Sitemap

ToliVelugu News provide Latest Telugu Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, Telangana and AP News Headlines Live, Latest Telugu News Online (తెలుగు తాజా వార్తలు)