ఏపీలో టెన్త్, ఇంటర్ పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది. మంత్రి ఆదిమూలపు సురేష్ వాటిని విడుదల చేశారు. మార్చి 11 నుంచి 31 వరకు ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు, ఏప్రిల్ 8 నుండి 28 వరకు ఇంటర్ థియరీ పరీక్షలు జరగనున్నాయి.
మొత్తం 1456 సెంటర్లలో ఇంటర్ పరీక్షలు జరుపుతున్నట్లు తెలిపారు మంత్రి సురేష్. ఇంటర్ మొదటి సంవత్సరంలో 5,05,052 మంది, సెకండియర్ లో 4,81,481 విద్యార్థులు పరీక్షలు రాయనున్నట్లు వివరించారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి.
ఇక మే 2 నుంచి 13 వరకు పదో తరగతి పరీక్షలు జరగనున్నాయి. మొత్తం 6,39,805 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతారని చెప్పారు మంత్రి సురేష్. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి.
టెన్త్, ఇంటర్ పరీక్షలు కరోనా నిబంధనలను పాటిస్తూనే నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు మంత్రి. ప్రస్తుతం స్కూళ్లు, కాలేజీలు కరోనా రూల్స్ పాటిస్తున్నట్లు తెలిపారు.