వైసీపీ విధానం మూడు రాజధానులే అన్నారు ఏపీ మంత్రి అంబటి రాంబాబు. బుధవారం విజయవాడలో భూగర్భ జలవనరుల డేటా సెంటర్ ను మంత్రి అంబటి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. సమతౌల్యత కోసమే మూడు రాజధానులన్నారు. రాయలసీమ, ఉత్తరాంధ్ర, కోస్తా అనే స్థానిక భావాలున్నాయని.. వాటిని వదులుకోకూడదనే మూడు రాజధానులు ఏర్పాటు చేస్తున్నామని స్పష్టం చేశారు.
నీటి పరీక్షలకు ఇకపై విజయవాడలో పూర్తి ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. పవన్ కళ్యాణ్ చాలా పచ్చబొట్లు వేసుకోవాలన్నారు. వారాహి ఏది? ఎక్కడ? ఆ సినిమా ఆపేశారా? అంటూ ఎద్దేవా చేశారు. అవగాహన ఉండి రాజకీయ విమర్శలు చేయాలి. మమ్మల్నే ప్రజలు ఆశీర్వదిస్తారనే విశ్వాసం పవన్ కే ఉదంటూ వ్యాఖ్యానించారు.
లోకేష్, పవన్ లకు నిబద్ధత లేదన్నారు. లోకేష్ తెలుగు వాడుక భాష మాట్లాడలేడంటూ ఎద్దేవా చేశారు. లోకేష్ పాదయాత్రతో టీడీపీ మరింత పతనం అవుతుందన్నారు. అచ్చెన్నాయుడు లాంటి వాళ్లు ఎందుకు లోకేష్ పాదయాత్ర పెట్టామా? అని తలలు పట్టుకుంటున్నారన్నారు.
ఏ పంటలకు అనుకూలంగా ఉండే జలాలు ఉన్నాయో విజయవాడలో ఏర్పాటు చేసిన భూగర్భ జలవనరుల డేటా సెంటర్ లోని ల్యాబ్ నిర్ణయిస్తుందన్నారు. రాష్ట్రంలో భూగర్భ జలాలు పుష్కలంగా ఉన్నాయని, ఏలూరు, విజయవాడ, చిత్తూరు, విశాఖలో డేటా సెంటర్లు ఏర్పాటు చేస్తామని చెప్పారు మంత్రి అంబటి.