రాష్ట్రంలో టూరిజం హోటళ్ల ను తెరుస్తున్నామన్నారు మంత్రి అవంతి శ్రీనివాస్. ఆగస్టు 15 నుండి అన్ని చోట్ల నుండి బోట్లు తిరిగేలా చర్యలు తీసుకుంటామన్నారు. పర్యాటక ప్రాంతదేశాలన్ని మళ్ళీ అందుబాటులోకి తెస్తామన్నారు. అన్ని జిల్లాల్లో పర్యాటక ప్రాంతాల్లో వారం రోజుల్లో పర్యాటకులకు అనుమతిస్తామన్నారు. టూరిస్ట్ బస్సులను కూడా వారం రోజుల్లో సిద్ధం చేస్తామన్నారు. టెంపుల్ టూరిజం ని బాగా అభివృద్ధి చేస్తామని ప్రసాద్ స్కీం ద్వారా సింహాచలం దేవస్థానం అభివృద్ధి చేస్తామని తెలిపారు.శ్రీశైలం లో 50 కోట్ల తో అభివృద్ధి పనులు చేశామని 4 క్రీడా వికాస కేంద్రాలను త్వరలో ప్రారంభిస్తామని తెలిపారు. ప్రతిభ గల పేదల పిల్లలను క్రీడల్లో ప్రోత్సహించేందుకు సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారని గత ఏడాది 3 కోట్లు పేద క్రీడాకారులు కు అందించామని తెలిపారు.ఈ ఏడాది కూడా 3 కోట్లు సీఎం కేటాయించారు. త్వరలోనే జిమ్ లను రాష్ట్రంలో ప్రారంభిస్తాం. పివి సింధు అకాడమీ కి విశాఖ లో భూములు కూడా కేటాయిస్తామన్నారు.