• Skip to main content
  • Skip to secondary menu
  • Skip to primary sidebar
tolivelugu-logo-removebg-preview

Tolivelugu తొలివెలుగు

Tolivelugu News provide Latest Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, TG and AP News Headlines Live (తెలుగు తాజా వార్తలు), Telugu News Online (తెలుగు తాజా వార్తలు)

tolivelugu facebook tolivelugu twitter tolivelugu instagram tolivelugu tv subscribe nowtolivelugu-app
  • తెలుగు హోమ్
  • వీడియోస్
  • రాజకీయాలు
  • వేడి వేడిగా
  • ఫిలిం నగర్
  • E-Daily
  • చెప్పండి బాస్
  • ENGLISH
Tolivelugu Latest Telugu Breaking News » Local News » ప్యాకేజీలు, సీట్ల కోసమే పవన్, బాబుల భేటీ..!

ప్యాకేజీలు, సీట్ల కోసమే పవన్, బాబుల భేటీ..!

Last Updated: January 8, 2023 at 6:27 pm

టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తాజా భేటీపై ఏపీ మంత్రి జోగి రమేష్ రియాక్ట్ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. వారిద్దరి భేటీపై విమర్శల వర్షం కురిపించారు. బుద్ధి ఉన్నవాడు ఎవరైనా కందుకూరులో, గుంటూరులో చనిపోయిన వారిని పరామర్శిస్తారని, చంద్రబాబు ఇంటికి వెళ్లి పరామర్శించడానికి వెళ్లడం ఏంటని ప్రశ్నించారు. అభం శుభం తెలియని అమాయకులు చనిపోతే.. ఏ రాజకీయ నాయకుడైనా బాధిత కుటుంబానికి నేనున్నానని ధైర్యం ఇవ్వాలి కానీ.. కుప్పంలో డ్రామాలాడిన చంద్రబాబు ఇంటికి వెళ్లాడన్నారు. అసలు చంద్రబాబుకి ఏం జరిగిందని పరామర్శించడానికి పవన్ వెళ్లాడు? అని జోగి రమేష్ నిలదీశారు.

AP Minister Jogi Ramesh Slams Chandrababu Naidu, Details Inside - Sakshi

పవన్, చంద్రబాబులది పవర్ ఫుల్ మీట్ కాదని, పవర్ ఫుల్ ప్యాకేజ్ అని ఎద్దేవా చేశారు. సంక్రాంతి ప్యాకేజ్ కోసమే చంద్రబాబు ఇంటికి పవన్ వెళ్లాడన్నారు. చంద్రబాబే సభలతో పోలీస్ వ్యవస్థ మీద దాడులు చేయించాడని జోగి రమేష్ ఆరోపణలు చేశారు. తనకు అసలు ఎదురే లేదన్నట్టు.. రోడ్ల వెంట చంద్రబాబు తిరిగారని మండిపడ్డారు.

దత్త తండ్రి ఇంటికి దత్తపుత్రుడు వెళ్లాడని దుయ్యబట్టారు. నాకు ఎంత ప్యాకేజ్ ఇస్తావ్, ఎన్ని సీట్లు ఇస్తావ్ అనే విషయాలు మాట్లాడుకోవడానికే ఈ భేటీ అని వ్యాఖ్యానించారు. లోపల అన్ని ప్యాకేజీ వ్యవహారాలే నడుస్తాయని విమర్శించారు. జగన్ ప్రభుత్వంతో రాష్ట్ర ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారన్నారు. ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా.. ప్రజలు ఎన్నుకున్న వైసీపీ ప్రభుత్వాన్ని, సీఎం జగన్ ని ఒక అంగుళం కూడా కదల్చలేరన్నారు.

పవన్ కు, చంద్రబాబుకు ప్రజా సమస్యలేమీ పట్టవని.. కేవలం దోచుకోవడం మీదే దృష్టంతా అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాబోయే ఎన్నికల్లో చంద్రబాబుకి, పవన్ కి ఓటమి తప్పదన్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ 175కి 175 సీట్లు గెలుస్తుందన్నారు. జగన్ ప్రభుత్వానికే ప్రజలు అనుకూలంగా తీర్పు ఇస్తారని నమ్మకం వ్యక్తం చేశారు జోగి రమేష్.

Primary Sidebar

తాజా వార్తలు

నగ ఎత్తుకెళ్ళిన నాటీ ఎలుక…!

దాని పై దృష్టి పెడితే భారత్ నెం.1

ఎలాంటి విచారణ అయినా సిద్ధమే!

ఉభయ సభల్లో బీఆర్ఎస్ వాయిదా తీర్మానాలు

రైట్‌ హ్యాండ్ నుంచి లెఫ్ట్‌ హ్యాండ్‌!

రేపటి నుంచి తెలంగాణ బడ్జెట్ సమావేశాలు

సీనియర్‌ డైరెక్టర్‌ సాగర్‌ మృతి!

భద్రాచలంలో బూజు పట్టిన లడ్డూలు..మెమోలిచ్చిన ఈవో!

పార్లమెంటును తాకిన ‘అదానీ సెగ’.. మధ్యాహ్నం వరకు వాయిదా

ఇక పై చెప్పం.. మంత్రి సీరియస్ వార్నింగ్‌!

కూతురి స్నేహితురాలి మీదే కన్నేసి!

ప్రభాస్ ప్రాజెక్ట్ కె.. అది ఫేక్ న్యూస్..!

ఫిల్మ్ నగర్

సీనియర్‌ డైరెక్టర్‌ సాగర్‌ మృతి!

సీనియర్‌ డైరెక్టర్‌ సాగర్‌ మృతి!

ప్రభాస్ ప్రాజెక్ట్ కె.. అది ఫేక్ న్యూస్..!

ప్రభాస్ ప్రాజెక్ట్ కె.. అది ఫేక్ న్యూస్..!

త్వరలోనే సూర్య 42 సినిమా టైటిల్‌!

త్వరలోనే సూర్య 42 సినిమా టైటిల్‌!

14 ఏళ్ల తరువాత విజయ్‌ తో త్రిష!

14 ఏళ్ల తరువాత విజయ్‌ తో త్రిష!

కియారా పెళ్లి ముహూర్తం ఫిక్స్‌!

కియారా పెళ్లి ముహూర్తం ఫిక్స్‌!

చీరకట్టులో కుందనపు బొమ్మలా కనిపిస్తున్న బుట్టబొమ్మ..!

చీరకట్టులో కుందనపు బొమ్మలా కనిపిస్తున్న బుట్టబొమ్మ..!

దుబాయ్ లో జంటగా దర్శనమిచ్చిన  విజయ్ దేవరకొండ,రష్మిక..!

దుబాయ్ లో జంటగా దర్శనమిచ్చిన విజయ్ దేవరకొండ,రష్మిక..!

ఇన్నాళ్ళకు సోషల్ మీడియాలో మెరిసిన సాయిపల్లవి... !!

ఇన్నాళ్ళకు సోషల్ మీడియాలో మెరిసిన సాయిపల్లవి… !!

Download Tolivelugu App Now

tolivelugu app download

Copyright © 2023 · Tolivelugu.com

About Us | Disclaimer | Contact Us | Feedback | Advertise With Us | Privacy Policy | Sitemap | News Sitemap