• Skip to main content
  • Skip to secondary menu
  • Skip to primary sidebar
tolivelugu-logo-removebg-preview

Tolivelugu తొలివెలుగు

Tolivelugu News provide Latest Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, TG and AP News Headlines Live (తెలుగు తాజా వార్తలు), Telugu News Online (తెలుగు తాజా వార్తలు)

tolivelugu facebook tolivelugu twitter tolivelugu instagram tolivelugu tv subscribe nowtolivelugu-app
  • తెలుగు హోమ్
  • వీడియోస్
  • రాజకీయాలు
  • వేడి వేడిగా
  • ఫిలిం నగర్
  • E-Daily
  • చెప్పండి బాస్
  • ENGLISH
Tolivelugu Latest Telugu Breaking News » రాజకీయాలు » పవన్ పై మంత్రి రోజా సీరియస్.. కావాలనే వస్తున్నాడంటూ!!

పవన్ పై మంత్రి రోజా సీరియస్.. కావాలనే వస్తున్నాడంటూ!!

Last Updated: October 14, 2022 at 2:02 pm

విశాఖ గర్జన పేరుతో వైసీపీ శనివారం భారీ కార్యక్రమం నిర్వహిస్తోంది. వికేంద్రీకరణకు మద్దతుగా ఈ కార్యక్రమం చేపడుతున్నారు. విశాఖలో అంబేద్కర్ విగ్రహం నుంచి వైఎస్సార్ విగ్రహం వరకు పాదయాత్ర నిర్వహించనున్నారు. అయితే అక్టోబరు 15 నుంచి మూడ్రోజుల పాటు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ విశాఖలో పర్యటించాలని నిర్ణయించారు. దీనిపై ఏపీ టూరిజం, క్రీడలు, యువజన శాఖ మంత్రి రోజా తీవ్రంగా స్పందించారు. ఈ సందర్భంగా మంత్రి రోజా తిరుమలలో మీడియాతో మాట్లాడుతూ.. వైసీపీ గర్జనను పక్కదారి పట్టించేందుకే పవన్ విశాఖలో పర్యటిస్తున్నారని మండిపడ్డారు.

చంద్రబాబుకు ఎప్పుడు ఏ కష్టం వచ్చినా ఈ దత్తపుత్రుడు నేనున్నానంటూ వస్తాడని ఎద్దేవా చేశారు. ఇప్పుడు కూడా విశాఖ గర్జనను తన పిచ్చిమాటలతో పక్కదారి పట్టించేందుకు వస్తున్నాడని రోజా విమర్శించారు. విశాఖలో రాజధాని అనేది ప్రజల సెంటిమెంటుకు సంబంధించిన విషయమని, ఎవరో వచ్చి పక్కదారి పట్టిస్తే సమసిపోయే విషయం కాదని స్పష్టం చేశారు. ఉత్తరాంధ్రకు రాజధాని కావాలని ప్రజలు, నేతలు అందరూ ఒక్కతాటిపైకి వచ్చారని, పవన్ కళ్యాణ్ కుప్పిగంతులు వారిముందు పనిచేయవన్నారు.

వేలు, లక్షల పుస్తకాలు చదివానని చెప్పుకునే పవన్ కళ్యాణ్ ఎప్పుడూ ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రజల కష్టాల గురించి పుస్తకాలు చదవలేదా? అని రోజా ప్రశ్నించారు. అప్పట్లో విశాఖలోనే రాజధాని ఏర్పాటు చేయాల్సిందని కమ్యూనిస్టు నేత పుచ్చలపల్లి సుందరయ్య కూడా అన్నారని తెలిపారు. రాష్ట్రంలో ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాలు బాగా వెనుకబడ్డాయని, వాటిని అభివృద్ధి చేసేందుకే సీఎం జగన్ వికేంద్రీకరణ తీసుకువస్తున్నారని రోజా వివరించారు.

ఉత్తరాంధ్ర గర్జనకు తాను మద్దతు ఇస్తున్నట్టు వెల్లడించారు. కర్నూలులో న్యాయ రాజధానిని స్వాగతిస్తున్నట్టు తెలిపారు. ఆస్తుల కోసం, రియల్ ఎస్టేట్ వ్యాపారాల కోసం అమరావతిలోనే రాజధాని ఉండాలంటున్న చంద్రబాబు చరిత్రహీనుడిగా నిలిచిపోతాడని రోజా వ్యాఖ్యానించారు. అమరావతి కోసం ఒంటికాలి జపం చేస్తూ, ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టేందుకు ప్రయత్నిస్తున్నాడని మండిపడ్డారు. అమరావతి నుంచి ఉత్తరాంధ్రకు పాదయాత్ర కోసం పెయిడ్ ఆర్టిస్టులను, దొంగ రైతులను పంపించాడని ఆరోపించారు. మూడు రాజధానులకు రాష్ట్ర ప్రజలందరి మద్దతు ఉందని, స్థానిక ఎన్నికలు, ఉప ఎన్నికల్లో వైసీపీ సాధించిన విజయాలే అందుకు నిదర్శనం అని రోజా పేర్కొన్నారు.

అటు, బాలయ్య అన్ స్టాపబుల్-2 షో పైనా రోజా స్పందించారు. ఆ ఎపిసోడ్ కు చంద్రబాబు హాజరు కాగా, దీనిపై రోజా మాట్లాడుతూ, మొన్న ఒక కార్యక్రమం చూశానని, బావాబావమరుదులు అన్ స్టాపబుల్ గా అబద్ధాలు చెప్పారని సెటైర్లు వేశారు. “ఆ రోజున బాలకృష్ణకూడా మాతో ఉన్నారు. ఎన్టీఆర్ కాళ్లు పట్టుకుని ఏడ్చాను… అయినా ఆయన వినలేదు. నేను చేసింది తప్పా?” అని చంద్రబాబు అడగడం చూస్తుంటే ప్రజలను పిచ్చోళ్లను చేయాలనుకుంటున్నట్టుందని రోజా విమర్శించారు.

పచ్చమీడియా ద్వారా చెబితే ప్రజలు నమ్మడంలేదు కాబట్టి, వేరే ఎంటర్టైన్ మెంట్ వేదిక ద్వారా చెప్పే ప్రయత్నం చేశారని ఆరోపించారు. ఇవన్నీ నమ్మడానికి ప్రజలేమీ పిచ్చివాళ్లు కాదని, వీళ్లు తింగరోళ్లు అనుకుంటూ ప్రజలు నవ్వుకుంటున్నారని అన్నారు. ఒక ప్రోమో వస్తేనే ఎన్ని వివాదాలు వచ్చాయో అందరికీ తెలిసిందేనని, ఎన్టీఆర్ తన ఆరాధ్య దైవం అని చంద్రబాబు చెప్పడం దెయ్యాలు వేదాలు వల్లించినట్టుందని విమర్శించారు మంత్రి రోజా.

Primary Sidebar

తాజా వార్తలు

ఇది కలెక్షన్ల “దసరా’… తెరకెక్కించిన తీరును ప్రసంసిస్తున్న ప్రముఖులు..!

ప్రజలకు మరో షాక్.. సైలెంట్ గా చార్జీలు పెంచేసిన టీఎస్ఆర్టీసీ

దీపిక అటు …రణవీర్ ఇటు ఇద్దరి మధ్యా ఎనీ ఇష్యూస్…!?

ప్రేమ వివాహం.. విడదీశారని యువకుడి సూసైడ్

తిన్నింటి వాసాలు లెక్కపెట్టిన చిట్టిదొంగ..!

రాహుల్ పై అనర్హత వేటుతో పార్టీకి ప్రయోజనం కల్ల.. పీకే

పేపర్ లీకేజీ కేసులో తెలంగాణ సర్కార్ ను వదిలేదే లేదు!

పెన్షన్ కోసం 15 ఏళ్లు అంధురాలిగా నటించి…అధికారులనే గుడ్డోళ్లని చేసింది..!

నడిరోడ్డుపై విద్యార్థిని వదిలేసిన ఘటనపై ఏబీవీపీ ఆగ్రహం

ఒకరిని ఒకరు ఏప్రిల్ ఫూల్ చేసుకున్న బీఆర్ఎస్, బీజేపీ!

గుజరాత్ టైటాన్స్ కు గట్టి షాక్

WHO హెచ్చరిక.. భారత్ లో భారీగా కరోనా మరణాల రేటు

ఫిల్మ్ నగర్

ఇది కలెక్షన్ల “దసరా’... తెరకెక్కించిన తీరును ప్రసంసిస్తున్న ప్రముఖులు..!

ఇది కలెక్షన్ల “దసరా’… తెరకెక్కించిన తీరును ప్రసంసిస్తున్న ప్రముఖులు..!

దీపిక అటు ...రణవీర్ ఇటు ఇద్దరి మధ్యా ఎనీ ఇష్యూస్...!?

దీపిక అటు …రణవీర్ ఇటు ఇద్దరి మధ్యా ఎనీ ఇష్యూస్…!?

చెర్రీ పెట్టుకున్న గ్లాసెస్ ధర తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!!

చెర్రీ పెట్టుకున్న గ్లాసెస్ ధర తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!!

vijat sethupathy comments on political entry

ఆ ఆలోచన లేదు: విజయ్‌ సేతుపతి!

actress sada dancing her famous song ranu ranu antune chinnadho

మళ్లీ రాను రాను అంటున్న చిన్నది!

janvi kapoor looking to hot in pink bikini

జాన్వీ కపూర్ అందాలు..చూడతరమా!

విరహవేదనతో...విడుదలైన ”శాకుంతలం’’ ఫీల్ గుడ్ సాంగ్... !

విరహవేదనతో…విడుదలైన ”శాకుంతలం’’ ఫీల్ గుడ్ సాంగ్… !

వరుస సినిమాలతో స్పీడు పెంచిన శ్రీలీల...భగత్ సింగ్ లో ఛాన్స్ కొట్టేసిందిగా బాల...!

వరుస సినిమాలతో స్పీడు పెంచిన శ్రీలీల…భగత్ సింగ్ లో ఛాన్స్ కొట్టేసిందిగా బాల…!

Download Tolivelugu App Now

tolivelugu app download

Copyright © 2023 · Tolivelugu.com

About Us | Disclaimer | Contact Us | Feedback | Advertise With Us | Privacy Policy | Sitemap | News Sitemap