టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలకు మంత్రి రోజా కౌంటర్ ఇచ్చారు. ‘లోకేష్ అంకుల్’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. పప్పునాయుడు యువగళం పాదయాత్ర ప్రారంభించినప్పుడే.. తన తండ్రి ఈ రాష్ట్రానికి ఏం చేశారో, ఏం చేయబోతున్నారో చెప్పకుండానే నడుస్తున్నారన్నారు.
ఒకవైపు చంద్రబాబు కాంగ్రెస్తో కుమ్మక్కై వేధించినా.. వైఎస్ జగన్ ఆత్మస్థైర్యంతో పాదయాత్రను ప్రారంభించారన్నారు. పేదల కష్టాలను వింటూ అధికారంలోకి వచ్చాక.. ఇచ్చిన ప్రతి హామీని తూచా తప్పకుండా నెరవేరుస్తున్నారని.. ఆ ధైర్యంతోనే మళ్ళీ ఓట్లు అడుగుతున్నామన్నారు.
తండ్రీకొడుకులు అవసరమైనప్పుడల్లా నందమూరి కుటుంబాన్ని వాడుకొని, అధికారం వచ్చాక వాళ్ళను విస్మరిస్తున్నారన్నారు. ఆ విషయాన్ని వాళ్లు గుర్తించలేకపోతున్నారని.. లోకేష్ సెక్యూరిటీ, వాలంటీర్లు లేకపోతే పది మంది కూడా పాదయాత్రలో ఉండరని ఎద్దేవా చేశారు. లోకేష్ది యువగళం పాదయాత్ర కాదు.. ఒంటరిగళం అంటూ సెటైర్లు పేల్చారు.
లోకేష్ లీడర్గా వంద శాతం ఫెయిల్యూర్.. ఇది మంగళగిరి ప్రజలు గుర్తించే ఓడించారన్నారు. తండ్రి ముఖ్యమంత్రిగా, తను మంత్రిగా ఉన్నా కనీసం ఎమ్మెల్యేగా గెలవలేని రికార్డు లోకేష్ది అని ఎద్దేవా చేశారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దోచుకొని హైదరాబాద్లో దాచుకోవడమే కాకుండా మళ్లీ తండ్రిని ముఖ్యమంత్రి పీఠం ఎక్కించాలని తహతహలాడుతున్నారన్నారన్నారు.