యాపిల్ సీఈఓ టిమ్ కుక్ స్వచ్ఛందంగా తన జీతాన్ని తగ్గించుకునేందుకు ముందుకు వచ్చారు. ఈ ఏడాది రావాల్సిన జీతంలో 40 శాతం కోత విధించారు. తన జీతాన్ని తగ్గించాలని టిమ్ కుక్ నే కోరినట్లు కంపెనీ పేర్కొంది. టిమ్ గత ఏడాది 100 మిలియన్ డాలర్లు జీతంగా తీసుకున్నారు. జీతంలో కోత కారణంగా ఈ ఏడాది 49 మిలియన్ డాలర్లను శాలరీగా పొందనున్నారు. అంటే గతేడాదితో పోలిస్తే ఆయన జీతం దాదాపు రూ.400 కోట్ల వరకు తగ్గనుంది.
జీతాల విషయంలో యాపిల్ షేర్ హోల్డర్ల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం కావడంతో టిమ్ కుక్ జీతాన్ని తగ్గించనున్నట్లు కంపెనీ ప్రకటించింది. మార్చి 10న జరగనున్న ఇన్వెస్టర్ డేలో షేర్ హోల్డర్ల పర్మిషన్ అనంతరం నిర్ణయం అమలు కానుంది. బోర్డ్ మెంబర్స్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని టిమ్ కుక్ స్వాగతించారు.
గతంలో 100 మిలియన్ డాలర్లలో 83 మిలియన్ డాలర్లు స్టాక్ అవార్డ్స్ గా, 15 మిలియన్ డాలర్లు ఇన్ సెంటివ్స్ గా అందుకున్నాడు. వీటితో పాటు రిటైర్ మెంట్ ప్లాన్ లో భాగంగా కాంపెన్సేషన్, సెక్యూరిటీ, ఫ్లైట్ జర్నీ, టూర్ ప్యాకేజీల రూపంలో 46,000 డాలర్లు అందుకున్నారు.
అయితే షేర్ హోల్డర్ల నిర్ణయంతో ఇన్ సెంటివ్స్ లో కూడా భారీ కోత ఉండబోనుంది. అలాగే రిటైర్ మెంట్ నాటికి లభించే స్టాక్ అవార్డ్స్ పరిమాణాన్ని సైతం తగ్గించాలని నిర్ణయించింది. యాపిల్ జరిపిన సే ఆన్ పే ఓటింగ్ లో 95 శాతం మంది షేర్ హోల్డర్లు శాలరీ తగ్గించాలని ఓట్ వేశారు. దీంతో టిమ్ కుక్ స్వయంగా తన శాలరీ తగ్గించుకున్నారు.