ఏపీఎస్ ఆర్టీసీ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు షాక్ ఇచ్చింది. ఒకేసారి ఆరువేల మందిపై వేటు వేస్తూ నిర్ణయం తీసుకుంది. నేటి నుంచి విధులకు హాజరుకావొద్దంటూ ఔట్ సోర్సింగ్ సిబ్బందికి డిపో మేనేజర్లు ఉత్తర్వులు జారీ చేశారు. ఆర్టీసీ ఎండీ మాదిరెడ్డి ప్రతాప్ రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా 6 వేల మంది ఉద్యోగులను విధుల నుంచి తొలగించినట్టు అధికారులు చెబుతున్నారు.
ఇప్పటి వరకూ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఏప్రిల్ నెల వేతనాలు సైతం అందలేదు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల తొలగింపుపై కార్మిక సంఘాలు భగ్గుమంటున్నాయి. ఆర్టీసీ యాజమాన్యం తీరును ఖండిస్తున్నాయి. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను యథావిధిగా కొనసాగించాలని ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం. బాలకాశి, కార్యదర్శి నూర్ మొహమ్మద్ లు డిమాండ్ చేశారు.