ఎంపీలపై విధించిన సస్పెన్షన్ ను తీసివేయాలంటూ విపక్ష ఎంపీలు పార్లమెంట్ ఆవరణలో ధర్నా చేస్తున్న విషయం తెలిసిందే. వారంతా ధర్నా చేస్తూ రాత్రి పార్లమెంట్ ఆవరణలోనే నిద్రపోయారు.
అయితే పార్లమెంట్ ఆవరణలో ఓపెన్గా నిద్ర పోవడం వల్ల వారికి దోమలు కుట్టాయి. అందుకు గానూ కొందరు ఎంపీలు దోమతెరలను తెప్పించుకొని, వాటిలో పడుకున్నారు. మరి కొందరు మాత్రం బెడ్ షీట్లు వేసుకొని పడుకున్నారు.
అసలు విషయం ఏంటంటే…. ధరల పెరుగుదలపై చర్చ చేపట్టాలని డిమాండ్ చేసిన విపక్ష ఎంపీలను వారం రోజుల పాటు సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. 24 మంది ఎంపీలపై విధించిన సస్పెన్షన్ను ఎత్తివేయాలని విపక్ష ఎంపీలు పార్లమెంట్ ఆవరణలో 50 గంటల ధర్నా చేస్తున్నారు.
అయితే పార్లమెంట్ ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద టెంటు వేసుకునేందుకు విపక్ష ఎంపీలకు అనుమతి లభించింది. రాత్రి వర్షం పడడంతో వారంతా పార్లమెంట్ ఎంట్రన్స్ వద్ద బెడ్ షీట్లు వేసుకొని నిద్రించారు.
కొందరు దోమతెరలను ఉపయోగించి నిద్రపోయారు.
నిరసన చేపడుతున్న విపక్ష ఎంపీలకు డీఎంకే లంచ్లో ఇడ్లీలు ఏర్పాటు చేసింది. ఇక టీఎంసీ తమ సభ్యులకు చేపల్ని తెచ్చి పెట్టింది. ఆందోళన చేస్తున్న ఎంపీలకు టీఆర్ఎస్ డిన్నర్ సర్వ్ చేస్తున్నట్లు తెలుస్తోంది.