జమ్మూ కశ్మీర్లో హిమపాతం బీభత్సం సృష్టించింది. చౌకీబాల్, తంగ్ ధర్ రహదారిలో హిమపాతం పరిస్థితి తీవ్రంగా ఉంది. దట్టమైన మంచులో సోమవారం 30 మంది పౌరులు చిక్కుకున్నారు. అక్కడే ఉన్న ఆర్మీ సిబ్బంది రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు.
30మంది పౌరులను సురక్షితంగా కాపాడారు. వీరంతా ఖూని నాలా, ఎస్ఏం హిల్ వద్ద కురుస్తున్న భారీ మంచులో చిక్కుకున్నారని తెలిపారు. భారీగా కురుస్తున్న మంచు కారణంగా ప్రతికూల వాతావరణమే ఉంది.
అనుకూల పరిస్థితులు ఉన్నప్పటికీ 14 మంది పౌరులను నీలం పాస్ వద్దకు.. 16 మందిని సాధన పాస్ వద్దకు సురక్షితంగా తీసుకువచ్చామని ఆర్మీ అధికారులు తెలిపారు. పౌరులందరికీ రాత్రిపూట ఆహారం, వైద్యం, ఆశ్రయం కల్పించామని ఆర్మీ అధికారులు పేర్కొన్నారు.
ఈ రెస్క్యూ ఆపరేషన్ దాదాపు ఆరు గంటలు కొనసాగిందని తెలిపారు. ప్రస్తుతం మంచులో చిక్కుకున్న వారందరు సురక్షితంగానే ఉన్నట్టు తెలిపారు. వారి ప్రాణాలకు ఎటువంటి ప్రాణాపాయం లేదని ఆర్మీ అధికారులు వెల్లడించారు.