ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. నాగులుప్పలపాడు మండలం రాపర్ల సమీపంలో మిర్చి కూలీలతో వెళ్తున్న ట్రాక్టర్ రోడ్డు ప్రమాదానికి గురైంది. ట్రాక్టర్ విద్యుత్ స్తంభాన్ని ఢీకొనడంతో అందులో ప్రయాణిస్తున్న 10 మంది అక్కడికక్కడే ప్రాణాలను కోల్పోయారు. మృతులంతా రాపర్ల చుట్టుపక్కల గ్రామాలకు చెందిన వారిగా భావిస్తున్నారు. ఈ ప్రమందంలో గాయపడిన పలువురిని చికిత్స నిమిత్తం ఒంగోలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ప్రాణాలు కోల్పోయిన వారిలో ఏడుగురు మహిళలు, ఒక రైతు, ఇద్దరు ఇంటర్ విద్యార్థులు ఉన్నారు. మృతదేహాలను ఒంగోలు రిమ్స్ ఆసుపత్రికి తరలించేందుకు పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రమాద సమయంలో ట్రాక్టర్ లో 15 మంది వరకు ఉండొచ్చని భావిస్తున్నారు.