సీనియర్ నటుడు నరేష్ ఇంటిపై గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేయడం తీవ్ర సంచలనం రేపుతోంది. నరేష్ కారవాన్ తో పాటు ఇతర వాహనాలు కూడా ధ్వంసమయ్యాయి. ఈ ఘటనపై గచ్చిబౌలి పోలీసులకు ఫిర్యాదు చేశాడు నరేష్. కేసు నమోదు చేసుకుకున్న పోలీసులు విచారణలో భాగంగా సీసీ ఫుటేజ్ ను పరిశీలిస్తున్నారు.
అయితే దాడి వెనుక తన భార్య రమ్య రఘుపతి హస్తముందని నరేష్ అనుమానం వ్యక్తం చేస్తున్నాడు. ఆమె కారులో ఇంటికి వచ్చిన కొద్దిసేపటికే తన పైన అటాక్ జరిగిందంటూ నరేష్ ఆరోపించాడు. ఇంటివద్ద రెక్కీ కూడా నిర్వహించారని నరేష్ పోలీసులకు తెలిపాడు.
కాగా గత కొంతకాలం నుంచి రమ్య రఘుపతితో నరేష్కు విభేదాలు తారాస్థాయికి చేరిన విషయం తెలిసిందే. అంతకుముందు సైతం ఇద్దరూ బహిరంగంగా ఘర్షణకు దిగిన సందర్భాలు ఉన్నాయి. ఈ క్రమంలో నరేష్ ఇంటిపై దాడి జరగడం కలకలం రేపింది.
అయితే తనపై, పవిత్ర లోకేశ్పై కొన్ని యూట్యూబ్ ఛానళ్ల ద్వారా రమ్య రఘుపతి దుష్ప్రచారం చేయిస్తోందని గతంలో సైబర్ క్రైం పీఎస్లో ఫిర్యాదు చేశాడు నరేష్. మూడు యూ ట్యూబ్ ఛానల్స్ తమ వ్యక్తిగత జీవితంలోకి ప్రవేశించి.. అన్నీ తెలిసినట్టే ప్రచారం చేస్తున్నాయని, ఆ ఛానల్ కు సంబంధించిన ఆధారాలు కూడా తన వద్ద ఉన్నాయని చెప్పాడు నరేష్.