• Skip to main content
  • Skip to secondary menu
  • Skip to primary sidebar
tolivelugu-logo-removebg-preview

Tolivelugu తొలివెలుగు

Tolivelugu News provide Latest Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, TG and AP News Headlines Live (తెలుగు తాజా వార్తలు), Telugu News Online (తెలుగు తాజా వార్తలు)

tolivelugu facebook tolivelugu twitter tolivelugu instagram tolivelugu tv subscribe nowtolivelugu-app
  • తెలుగు హోమ్
  • వీడియోస్
  • రాజకీయాలు
  • వేడి వేడిగా
  • ఫిలిం నగర్
  • E-Daily
  • చెప్పండి బాస్
  • ENGLISH
Tolivelugu Latest Telugu Breaking News » International » హాట్ కేకుల్లా అమ్ముడుపోయిన వరల్డ్ కప్ టికెట్స్!!

హాట్ కేకుల్లా అమ్ముడుపోయిన వరల్డ్ కప్ టికెట్స్!!

Last Updated: October 14, 2022 at 5:07 pm

టీ20 వరల్డ్ కప్ కు ఉండే క్రేజే వేరు. క్రికెట్ లవర్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వరల్డ్ కప్ త్వరలోనే ప్రారంభం కాబోతుంది. మరో మెగా సమరానికి క్రికెట్ ప్రపంచం సిద్ధమవుతోంది. ఆస్ట్రేలియా వేదికగా టీ20 ప్రపంచకప్ ఆదివారం నుంచే ప్రారంభం కానుంది. దాదాపు రెండేళ్ల తర్వాత జరుగుతున్న ఈ మెగా టోర్నీ జరగబోతుంది. కరోనా కారణంగా మధ్యలో వరల్డ్ కప్ వాయిదా పడుతూ వచ్చింది. అయితే ఈ సారి టికెట్లకు భారీ డిమాండ్ నెలకొంది. పెద్ద సంఖ్యలో ప్రేక్షకులు స్టేడియంలో మ్యాచ్ లను చూసేందుకు ఎగబడుతున్నారు. ఇప్పటికే ఆరు లక్షలకు పైగా టికెట్లు అమ్ముడుపోయాయని ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు శుక్రవారం వెల్లడించింది.

ఈ వరల్డ్ కప్ కోసం టీమిండియా సహా ఇప్పటికే కొన్ని జట్లు ఆస్ట్రేలియా చేరుకున్నాయి. ప్రాక్టీస్ మ్యాచ్ లతో అక్కడ క్రికెట్ సందడి నెలకొంది.ఈ నెల 16న టీ20 వరల్డ్ కప్ మొదలవనుంది. మొదటగా గ్రూప్ స్టేజ్ మ్యాచులు జరుగుతాయి. గ్రూప్ స్టేజ్ లో శ్రీలంక, నమీబియా, UAE, వెస్టిండీస్, నెదర్లాండ్స్ , స్కాట్లాండ్ , జింబాబ్వే, ఐర్లాండ్ జట్లు పోటీ పడతాయి.

అక్టోబర్ 22 నుంచి సూపర్ 12 రౌండ్ ప్రారంభం అవుతుంది. ఫస్ట్ మ్యాచులో డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియా న్యూజిలాండ్ తో తలపడనుంది. సూపర్ 12లో భాగంగా అక్టోబర్ 23న చిరకాల ప్రత్యర్థులు భారత్-పాక్ తలపడనున్నాయి. మెల్ బోర్న్ లో ఈ మ్యాచ్ జరగనుంది. ఈ నేపథ్యంలో మ్యాచ్ టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి.

టీమిండియా, పాకిస్తాన్ మ్యాచ్ కు సంబంధించి 90 వేల టికెట్లు విక్రయించినట్లు ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు ప్రకటించింది. ఇవే కాదు.. మిగతా మ్యాచుల టికెట్లన్నీ భారీగానే అమ్ముడయిపోయాయి. గీలాంగ్‌లోని 36 వేల కెపాసిటీ గల కార్డినియా పార్క్ స్టేడియంలో శ్రీలంక నమీబియాతో తలపడనుంది. ఈ మ్యాచ్ కు సంబంధించి మాత్రమే టికెట్లు అందుబాటులో ఉన్నాయని ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు తెలిపింది.

Primary Sidebar

తాజా వార్తలు

పనివాడికి 10 కోట్ల లాటరీ…!

సూర్య@ చెన్నై టూ ముంబై..ఖరీదైన ఇల్లు కొనుగోలు..!

బాలయ్యకు జోడీగా కాజల్ అగర్వాల్ రీ ఎంట్రీ..!

ఉగాదికి వస్తున్నాడోయ్ మన రంగమార్తాండ..!

ఏజెంట్ కు నాటు హీరోల ప్రమోషన్…!

నేను అలా చెప్పడం ఆపను.. రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు..!

10 గంటలు.. పదుల్లో ప్రశ్నలు

అయోధ్యలో ఘనంగా ‘శ్రీరామ నవమి’ వేడుకలు

ధీరేంద్ర స్వామీజి‘ దివ్య దర్బార్’లో భారీ చోరీ…!

బీఆర్ఎస్ శ్రేణులకు సీఎం కేసీఆర్ బహిరంగ లేఖ

తుస్సుమన్న కేజ్రీవాల్ యత్నం.. థర్డ్ ఫ్రంట్ ‘మిథ్య’ !

ఇంకా ఈడీ ఆఫీస్ లోనే కవిత

ఫిల్మ్ నగర్

సూర్య@ చెన్నై టూ ముంబై..ఖరీదైన ఇల్లు కొనుగోలు..!

సూర్య@ చెన్నై టూ ముంబై..ఖరీదైన ఇల్లు కొనుగోలు..!

బాలయ్యకు జోడీగా కాజల్ అగర్వాల్ రీ ఎంట్రీ..!

బాలయ్యకు జోడీగా కాజల్ అగర్వాల్ రీ ఎంట్రీ..!

ఉగాదికి వస్తున్నాడోయ్ మన రంగమార్తాండ..!

ఉగాదికి వస్తున్నాడోయ్ మన రంగమార్తాండ..!

ఏజెంట్ కు నాటు హీరోల ప్రమోషన్...!

ఏజెంట్ కు నాటు హీరోల ప్రమోషన్…!

డెవిల్ కి దడపుట్టించనున్న ఎల్నాజ్ నోరౌజీ స్పెషల్ సాంగ్ ...!

డెవిల్ కి దడపుట్టించనున్న ఎల్నాజ్ నోరౌజీ స్పెషల్ సాంగ్ …!

actress mrunal thakur movie remuneration

సీతమ్మ ఒక్క సినిమాకే అంత డిమాండా?

kangana warning board becomes talk of town

హద్దు మీరితే కాల్చిపడేస్తా!

wedding photos deleted is there a difference between niharika and chaitanya

మరోసారి తెర మీదకు మెగా డాటర్‌ విడాకుల మ్యాటర్!

Download Tolivelugu App Now

tolivelugu app download

Copyright © 2023 · Tolivelugu.com

About Us | Disclaimer | Contact Us | Feedback | Advertise With Us | Privacy Policy | Sitemap | News Sitemap