
విశాఖ: ఇద్దరు శీనుల మధ్య మాటల మంటలు మరింత చెలరేగాయ్. ‘గంటా శ్రీనివాసరావు రాజకీయ వ్యభిచారి’ అని రాష్ట్ర మంత్రి ముత్తంశెట్టి అవంతి శ్రీనివాసరావు తాజాగా తీవ్రమైన పదజాలతో విరుచుకుపడ్డారు. తెలుగుదేశం అభిమానులు వేసిన ఓట్లతో గెలిచి, ఆ పార్టీ కార్యాలయంలో సమావేశం నిర్వహించి, తనకు అన్ని పార్టీల నుంచి రమ్మని ఆహ్వానం ఉందని చెప్పడమే గంటా రాజకీయ వ్యభిచారానికి నిదర్శనమని అవంతి అన్నారు. అవంతి ఇంకా ఏమన్నారంటే…
- గంటాకు రాజకీయం ఒక వ్యాపారం.
- అందుకే ఒకసారి పోటీ చేసిన నియోజకవర్గంలో రెండోసారి పోటీ చేయరు.
- ఎప్పుడూ అధికారంలో ఉండాలని ఉంటుంది.
- అందుకే ఇప్పుడు వైసీపీలో చేరడానికి అమరావతి చుట్టూ, బీజేపీలో చేరడానికి ఢిల్లీ చుట్టూ తిరుగుతున్నారు.
- అన్ని పార్టీల నుంచి ఆఫర్ ఉందనేది అబద్ధం.
- ఎక్కడా ఆయనకు అవకాశాల్లేవు.
- విశ్వాసంతో గెలిపించిన ప్రజల్ని, నాయకుల్ని, కార్యకర్తల్ని, అనుచరుల్ని అందరినీ వదిలేసి తన స్వార్థం తాను చూసుకుంటారు. అదే గంటా నైజం
- ఇది ప్రజాస్వామ్య దేశం, ఎవరైనా ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి కావచ్చు.
- గంటా ఆ విషయం మరిచిపోయి తానేదో రాచరికపు కుటుంబంలో పుట్టినట్లు మాట్లాడడం సరికాదు.
- మీ తండ్రి, తాతలు మంత్రులు కారు. మీరు నెల్లూరు మెస్లో టికెట్లు అమ్ముకుని.. వ్యాపార భాగస్వాములను మోసం చేసి పైకి వచ్చారు. నేను అలా రాలేదు.
- నా జోలికి వస్తే వదిలిపెట్టను. అసలు వైజాగ్లోనే లేకుండా చేస్తాను.
- అయ్యన్నపాత్రుడంత మంచోడిని కాను, నాతో పెట్టుకోవద్దు.
- అహంకారంతో, సంకుచిత ధోరణితో గంటా మాట్లాడుతున్నారు.
- ఆయన్ను నేను మనిషిగానే చూడడం లేదు.
- ఆయనంటే నాకు వ్యక్తిగతంగా ఎటువంటి కక్ష, ద్వేషం లేవు. కానీ ఆయన వ్యక్తిత్వమే నచ్చదు.
- విజయనగరం జిల్లా ఇన్చార్జి మంత్రిగా ఉండి తొమ్మిది సీట్లలో ఒక్కచోట కూడా టీడీపీ అభ్యర్థిని గెలిపించలేకపోయారు.
- ఎక్కడున్నా వర్గ, గ్రూపు రాజకీయాలను ప్రోత్సహిస్తారు.
- వంచన, దగా, మోసం, కుట్రలు ఇవే ఆయన జీవితం.
- ఇప్పటికైనా గంటా ఆత్మపరిశీలన చేసుకోవాలి.