టీ అందరికీ ఇష్టమైన, శక్తినిచ్చే పానీయం. కానీ.. అతిగా టీ తాగడం అనారోగ్యకరమంటారు. కెఫీన్ మరియు షుగర్ కారణంగా టీ ఎక్కువగా తాగడం వల్ల శరీరానికి అనేక రకాల హాని కలుగుతుందని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. దీంతో చక్కెర ఆరోగ్యానికి హాని చేస్తుందన్న అవగాహన పెరుగుతోంది. దీంతో కొందరు చక్కెర మానేసి బెల్లానికి ప్రాధాన్యం ఇస్తున్నారు. టీ లో బెల్లం, తేనె కలుపుకుని తాగుతున్నారు. కానీ.. ఆయుర్వేదం మాత్రం టీ, బెల్లం కలయిక సరైనది కాదని అంటోంది.
విరుద్ధ ఆహారం లేదా అసహజమైన పదార్థాల కలయికతో ఆమ గుణానికి దారితీస్తుందని ఆయుర్వేద నిపుణులు చెప్తున్నారు. జీర్ణంపై ప్రభావం చూపించే హానికారకాలు విడుదల అవుతాయంటున్నారు. ప్రతీ ఆహారానికి ప్రత్యేకమైన గుణాలు ఉంటాయని.. ఇవి రుచి, శక్తి, జీర్ణక్రియపై ప్రభావం చూపుతాయని ఆయుర్వేద వైద్య నిపుణులు డాక్టర్ రేఖ రాధామణి స్పష్టం చేశారు.
బెల్లం అన్నది వేడిని కలిగిస్తే.. పాలు చల్లదనాన్ని ఇస్తాయని.. ఈ రెండింటిని కలపడం అనుకూలమైనదిగా పేర్కొన్నారు డాక్టర్. మిశ్రి లేదా రాక్ షుగర్ మంచిదని.. పాలు మాదిరే చల్లటి గుణంతో ఉండడం అనుకూలమని రాధామణి వెల్లడించారు.
ఆరోగ్యంపై ప్రభావం చూపించే అసహజ కలయికల్లో.. అరటి పండు, పాలు.. పాలు, చేపలు.. పెరుగు, వెన్న, తేనె, నెయ్యి.. ఇలా పొందికలేని పదార్థాలను కలిపి తీసుకోవడం వల్ల శరీరంలో అనారోగ్య మార్పులు వస్తాయని వెల్లడించారు. దీని కారణంగా వాపు, చర్మ సమస్యలు, ఆటో ఇమ్యూన్ సమస్యలు కలుగుతాయని రాధామణి హెచ్చరించారు.