ఎస్ఐ, కానిస్టేబుల్ అభ్యర్థులకు నోటీసులతో కూడిన బెయిల్ మంజూరు చేశారు పోలీసులు. 38 మందిపై 341, 147, 149, 352, 353 ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. వారందరికీ సీఆర్పీసీ 41ఏ నోటీసులు ఇచ్చి, అనంతరం బెయిల్ మంజూరు చేసి పంపారు.
కాగా రన్నింగ్ లో క్వాలిఫై అయిన ఎస్ఐ, కానిస్టేబుల్ అభ్యర్థులకు మెయిన్స్ రాసే అవకాశమివ్వాలంటూ వారు ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే. డీజీపీ ఆఫీస్, ప్రగతి భవన్, అసెంబ్లీ ముట్టడికి ప్రయత్నించిన 16 మందితో పాటు శాసనసభ పరిసరాల్లో నిరసన చేపట్టిన 12 మందిపై కేసు నమోదు చేశారు పోలీసులు.
అయితే శాంతియుతంగా ఆందోళన చేస్తున్న తమపై అక్రమంగా కేసులు పెట్టారని అభ్యర్థులు వాపోయారు. దేశంలో ఎక్కడా లేని విధంగా లాంగ్ జంప్ 4 మీటర్లు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.
తెలంగాణలో 2014, 2018 నోటిఫికేషన్ లలో లాంగ్ జంప్ 3.8 మీటర్లు మాత్రమే ఉందన్న అభ్యర్థులు.. తమ సమస్యను రిక్రూట్మెంట్ బోర్డు పరిష్కరించాలని కోరారు. ఈ ఘటనలో మొత్తం 38 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు.