హిందూపూర్ విషయంలో ఎంత దూరమైనా వెళ్తానని నందమూరి బాలకృష్ణ అన్నారు. హిందూపూర్ ను జిల్లాగా ప్రకటించాలని అవసరమైతే సీఎం జగన్ ను కూడా కలవడానికి సిద్ధంగా ఉన్నానని బాలకృష్ణ తెలిపారు. హిందూపురం ప్రభుత్వాసుపత్రిని సందర్శించిన ఆయన ఆసుపత్రికి 55 లక్షల రూపాయలు విలువచేసే పరికరాలను అందజేశారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ రాష్ట్రంలో అభివృద్ధి కంటే కక్ష సాధింపు చర్యలే ఎక్కువగా ఉన్నాయన్నారు. రాజధాని లేకుండా టిడిపి హయాంలో తెలంగాణ కన్నా అధిక ఆదాయం వచ్చిందన్నారు. రాష్ట్రంలో అందరూ కలిసి ఉంటేనే అభివృద్ధి సాధ్యమని బాలకృష్ణ పేర్కొన్నారు. కష్టకాలంలో పార్టీలకు అతీతంగా వ్యవహరించాలని కోరారు.