ఆర్ధిక వ్యవస్థ చిన్నాభిన్నమైందంటూ సచివాలయం అగ్నిమాపక కేంద్రం వద్ద గురువారం ఉదయం తెలుగుదేశం శాసనసభ పక్షం నిరసనకు దిగింది. ఏపీ అసెంబ్లీలో ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గురువారం బడ్జెట్ ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే.
ఈ సమావేశాలకు హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కూడా హాజరయ్యారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా అసెంబ్లీ వద్ద టీడీపీ చేపట్టిన ఆందోళనలో ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ‘ఏపీలో దివాలా బడ్జెట్.. జగన్ రెడ్డి కళకళ.. ప్రజలు గిలగిల’ అని రాసి ఉన్న బ్యానర్ ను పట్టుకుని టీడీపీ సభ్యులతో కలిసి అసెంబ్లీకి బాలయ్య వచ్చారు.’అప్పుల ఆంధ్రప్రదేశ్’ అని రాసి ఉన్న ప్లకార్డులు పట్టుకుని నిరసన తెలిపారు.
మరోవైపు అసెంబ్లీ లాబీల్లో బాలయ్యను మంత్రులు బొత్స సత్యనారాయణ, అంబటి రాంబాబు, అమర్నాథ్ పలకరించారు. ‘ఏం హీరో గారు’ అంటూ బాలయ్యకు బొత్స అభివాదం చేశారు. ఇవాళ కోటు వేసుకు రాలేదేమంటూ మంత్రి అమర్నాథ్ను ఉద్దేశించి బాలయ్య చమత్కరించారు.