కథానాయకుడు నందమూరి బాలకృష్ణ అంటే మనందరికీ ముందుగా గుర్తుకు వచ్చేది…. సింహంలా గర్జిస్తూ ఉండే ఆయన కోపం. కానీ అది ఆయనలోని ఓ కోణం మాత్రమే. ఆయనలో కోపం ఎంత ఉంటుందో ప్రేమ కూడా అంతే ఉంటుంది.
అందుకే బాలయ్య ను అభిమానులు ఎంతగానో ఇష్టపడుతుంటారు. తాజాగా బాలయ్య మరోసారి ఫ్యాన్స్ పట్ల తనకున్న ప్రేమని చాటుకున్నారు. ప్రస్తుతం బాలయ్య కర్నూలులో మలినేని గోపిచంద్ సినిమాకు సంబంధించి కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు.
అయితే గతంలో ఓ అభిమానికి బాలయ్య మాట ఇచ్చారు. ఈసారి కర్నూలులో వస్తే తప్పకుండా కలుస్తానని చెప్పారు. దాంతో ప్రస్తుతం బాలయ్య కర్నూలులో ఉండటంతో ఇచ్చిన మాట తప్పకుండా అభిమానికి స్వయంగా ఆయనే ఫోన్ చేసి కుటుంబంతో సహా తనని కలవడానికి రావాలని పిలిచి సర్ప్రైజ్ ఇచ్చారు.
ఇంతకీ ఆ అభిమాని ఎవరంటే… ఆదోని బాలకృష్ణ అభిమాన సంఘం అధ్యక్షుడు సజ్జాద్ హుస్సేన్. ఈ మేరకు కుటుంబంతో కలిసి కర్నూలు రావాలని బాలయ్య అతనికి స్వయంగా ఫోన్ చేసి చెప్పారు.అంతేకాకుండా తన దగ్గరకు వచ్చిన అభిమాని కుటుంబంతో కలిసి బాలకృష్ణ భోజనం చేశారు. అంతేకాకుండా అభిమాని పిల్లలతో సరదాగా ఆడుకున్నారు.
కాగా ఈ వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తమ అభిమాన హీరో బాలయ్యతో కలిసి కొంతసేపు గడపడం, భోజనం చేయడంతో హుస్సేన్ ఫ్యామిలీ ఆనందంలో మునిగి తేలుతున్నారు. తమలాంటి వారితో కలిసి బాలయ్య భోజనం చేయడం సంతోషంగా ఉందని… ఇది ఆయన గొప్పతనానికి నిదర్శనమని కొనియాడారు.
తమ కుటుంబం ఈ జన్మలో మరిచిపోలేనిదని, తమకు బాలయ్య ఇచ్చిన బెస్ట్ మెమొరీ అని సజ్జాద్ హుస్సేన్ పేర్కొన్నారు.
#NBKfan's about #Balakrishna Garu pic.twitter.com/abLKGAkAEg
— Nagendra (@mavillanagendra) July 25, 2022
Advertisements