తీగ లాగితే డొంక అంతా కదిలినట్లు.. మాదక ద్రవ్యాల కేసులో కొత్త కొత్త కోణాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో మరో నిందితుడు బాలమురుగన్ ను నార్కోటిక్ ఎన్ ఫోర్స్ మెంట్ వింగ్ పోలీసులు గోవాలో అరెస్ట్ చేశారు.
మాదక ద్రవ్యాల కింగ్ పిన్ ఎడ్విన్ తో కలిసి బాల మురుగన్ మాదక ద్రవ్యాలను సరఫరా చేసేవాడు. ఎడ్విన్ ఇచ్చిన సమాచారంతో బాలమురుగన్ ను అరెస్ట్ చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు.
తమిళనాడు, కేరళ, రాజస్థాన్, హిమాచల్ప్రదేశ్, గోవాలో జోరుగా మాదక ద్రవ్యాలను సరఫరా సాగిస్తున్నాడనే సమాచారంతో నార్కోటిక్ పోలీసులు మెరుపు దాడి చేశారు. అక్రమ సంపాదనతో బాలమురుగన్ హోటళ్లు ఏర్పాటు చేసినట్టు గుర్తించారు.
హోటళ్ల కేంద్రంగా బాలమురుగన్ మాదక ద్రవ్యాలను సరఫరా చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. నిందితుడి జాబితాలో దేశవ్యాప్తంగా 2 వేల మంది వినియోగదారులు ఉన్నట్టు గుర్తించారు. బాల మురుగన్ ను గోవా నుంచి హైదరాబాద్కు తీసుకువచ్చారు పోలీసులు. ఇంకా ఈ కేసులో ఎవరైనా ఉన్నారా అని పోలీసులు నిందితుడిని విచారిస్తున్నారు.