• Skip to main content
  • Skip to secondary menu
  • Skip to primary sidebar
Tolivelugu తొలివెలుగు – Latest Telugu Breaking News

Tolivelugu తొలివెలుగు - Latest Telugu Breaking News

Tolivelugu News provide Latest Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, TG and AP News Headlines Live (తెలుగు తాజా వార్తలు), Telugu News Online (తెలుగు తాజా వార్తలు)

tolivelugu facebook tolivelugu twitter tolivelugu instagram tolivelugu tv subscribe nowtolivelugu-app
  • తెలుగు హోమ్
  • వీడియోస్
  • రాజకీయాలు
  • వేడి వేడిగా
  • ఫిలిం నగర్
  • E-Daily
  • చెప్పండి బాస్
  • ENGLISH
Tolivelugu Latest Telugu Breaking News » Scrolling » సీఎంకు మతి భ్రమించినట్టుంది… కేసీఆర్ పై బండి సంజయ్ ఫైర్

సీఎంకు మతి భ్రమించినట్టుంది… కేసీఆర్ పై బండి సంజయ్ ఫైర్

Last Updated: July 17, 2022 at 8:09 pm

తెలంగాణలో భారీ వర్షాల వెనుక విదేశీ కుట్ర ఉందన్న సీఎం కేసీఆర్ వ్యాఖ్యలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం వ్యాఖ్యలు హాస్యాస్పదం అని ఆయన అన్నారు. సీఎంకు మతి భ్రమించినట్లుందన్నారు. అందుకే ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఎర్రగడ్డ ఆస్పత్రిలో చేర్పించాలని ఆయన అన్నారు.

వరద ముంపు ప్రాంతాల్లో కేసీఆర్ పర్యటనను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని ఆయన తెలిపారు. వరద ప్రాంతాల్లో ముఖ్యమంత్రి పర్యటిస్తే అక్కడి ప్రజలు, బాధితులకు భరోసా కలగాలన్నారు. కానీ కేసీఆర్ వ్యాఖ్యలు జోకర్ ను తలపిస్తున్నాయని చెప్పారు.

గతంలోనూ గోదావరి నదికి ఎన్నో సార్లు వరదలు వచ్చాయని, ఈ సారి కూడా అదే విధంగా జరిగిందని, భవిష్యత్ లో వరదలు రావని కూడా చెప్పలేమన్నారు. కానీ కేసీఆర్ కు మాత్రం ఇవి మానవులు సృష్టించినవిగా కనిపిస్తున్నాయని చెప్పారు. వాటిని విదేశీ కుట్రలుగా సీఎం చెబుతున్నారని, అసలు కుట్రలకే అతి పెద్ద కుట్రదారుడు సీఎం కేసీఆర్ అని ఆయన మండిపడ్డారు.

ఇంజనీరింగ్ నిపుణుడినంటూ సీఎం కేసీఆర్ గొప్పలు చెప్పుకున్నారని, ఆయన రీడిజైన్ చేసిన కాళేశ్వరం ప్రాజెక్టు పంప్ హౌజ్ వర్షాలకు మునిగిపోయిందన్నారు. మిషన్ కాకతీయలో పేరుతో పూడికలు తీశారని, కరకట్టల నిర్మాణాన్ని విస్మరించడంతో పలు చోట్ల చెరువులు, కుంటలు తెగి వేల ఎకరాల్లో పంట నష్టం జరిగిందన్నారు. ఈ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు ఇప్పుడు విదేశీ కుట్ర పేరుతో మరో డ్రామాను మన ముందుకు కేసీఆర్ తీసుకు వచ్చారని అన్నారు.

ఇప్పటికైనా కేసీఆర్ ఈ పోరంబోకు మాటలాపి వరదలతో నిరాశ్రయులైన వారిని ఎలా ఆదుకుంటారో చెప్పాలని డిమాండ్ చేశారు.
ముంపు బాధితుల కుటుంబాలకు రూ.10 వేలు ఇస్తానంటున్నారని, సర్వం కోల్పోయిన బాధితులకు ఆ డబ్బు ఏ మూలకు సరిపోతుంది? అని ప్రశ్నించారు. గతంలో హైదరాబాద్ వరద ముంపు బాధితులకు రూ.10 వేల సాయం చేస్తానని హామీ ఇచ్చి గతంలో వాటిని ఎగ్గొట్టారని సంజయ్ గుర్తు చేశారు.

Primary Sidebar

తాజా వార్తలు

మునుగోడుపై కాంగ్రెస్‌ ఫోకస్‌.. ప్రత్యేక కార్యాచరణ!

అంతా డ్రామా.. కలిసే ఇదంతా!

బలవంతపు పెళ్లి చేస్తున్నారంటూ తల్లిదండ్రులపై యువతి ఫిర్యాదు

ఢిల్లీలో ఒమిక్రాన్ కొత్త వేరియంట్.. !

మేమూ పార్టీ మారాము… కానీ నితీష్ లాగా కాదు..!

ఉపరాష్ట్రపతిగా జగదీప్‌ ధన్‌ కర్‌ ప్రమాణ స్వీకారం

ప్రధాని బ్లాక్ మ్యాజిక్ వ్యాఖ్యలపై రాహుల్ గాంధీ ఫైర్..!

పాముకాటుతో ఓయూ ఉద్యోగిని మృతి

అదో పెద్ద జోక్…!

వజ్ర సంకల్పంతో బండి పాదయాత్ర

సికింద్రాబాద్ లో అగ్నిపథ్ అల్లర్ల కేసులో ఛార్జ్ షీట్ కు రంగం సిద్ధం

సీఎం అభ్యర్థిత్వం విషయంలో ఈటల క్లారిటీ

ఫిల్మ్ నగర్

విశాల్ ను వెంటాడుతున్న ప్రమాదాలు.. మరోసారి ఆస్పత్రిపాలు!

విశాల్ ను వెంటాడుతున్న ప్రమాదాలు.. మరోసారి ఆస్పత్రిపాలు!

v-v-vinayak

కళ్యాణ్ రామ్ కు వినాయక్ థాంక్స్ ఎందుకు చెప్పాడు?

ఎక్స్ క్లూజివ్.. సైలెంట్ గా స్టార్ట్ అయిన పవన్ సినిమా

ఎక్స్ క్లూజివ్.. సైలెంట్ గా స్టార్ట్ అయిన పవన్ సినిమా

స్వాతిముత్యం తట్టుకోగలడా?

స్వాతిముత్యం తట్టుకోగలడా?

మనసులో మాట బయటపెట్టిన రష్మిక

మనసులో మాట బయటపెట్టిన రష్మిక

రవితేజ, శ్రీవాస్ కాంబోలో సినిమా వస్తోందా?

రవితేజ, శ్రీవాస్ కాంబోలో సినిమా వస్తోందా?

పూర్ణ హగ్..ఇంతకీ అతనెవరంటే

పూర్ణ హగ్..ఇంతకీ అతనెవరంటే

దయచేసి క్షమించండి..బాయ్‌ కాట్‌ పై అమీర్‌ రియాక్షన్‌!

దయచేసి క్షమించండి..బాయ్‌ కాట్‌ పై అమీర్‌ రియాక్షన్‌!

Download Tolivelugu App Now

tolivelugu app download

Copyright © 2022 · Tolivelugu.com

About Us | Disclaimer | Contact Us | Feedback | Advertise With Us | Privacy Policy | Sitemap | News Sitemap

ToliVelugu News provide Latest Telugu Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, Telangana and AP News Headlines Live, Latest Telugu News Online (తెలుగు తాజా వార్తలు)