• Skip to main content
  • Skip to secondary menu
  • Skip to primary sidebar
Tolivelugu తొలివెలుగు – Latest Telugu Breaking News

Tolivelugu తొలివెలుగు - Latest Telugu Breaking News

Tolivelugu News provide Latest Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, TG and AP News Headlines Live (తెలుగు తాజా వార్తలు), Telugu News Online (తెలుగు తాజా వార్తలు)

tolivelugu facebook tolivelugu twitter tolivelugu instagram tolivelugu tv subscribe nowtolivelugu-app
  • తెలుగు హోమ్
  • వీడియోస్
  • రాజకీయాలు
  • వేడి వేడిగా
  • ఫిలిం నగర్
  • E-Daily
  • చెప్పండి బాస్
  • ENGLISH
Tolivelugu Latest Telugu Breaking News » Hyderabad » ధరణి పోర్టల్ ప్రజలకా..? కేసీఆర్ బినామీలకా..?

ధరణి పోర్టల్ ప్రజలకా..? కేసీఆర్ బినామీలకా..?

Last Updated: January 30, 2022 at 6:49 pm

అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ మిలియన్ మార్చ్‌ నిర్వహించి తీరుతామని స్పష్టం చేశారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. పార్టీ రాష్ట్ర కార్యాలయంలో బీజేవైఎం ఆధ్వర్యంలో చేపట్టిన కోటి సంతకాల సేకరణలో భాగంగా తొలి సంతకం చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. సీఎం మాటలు తెలంగాణ ప్రజలు నమ్మే పరిస్థితి లేదని విమర్శించారు. ఉద్యమ నాయకుడిగా కేసీఆర్ ఇచ్చిన హామీలు.. సీఎం అయ్యాక అమలు చేయకుండా నిరుద్యోగులను నిలువునా మోసం చేశారని ధ్వజమెత్తారు.

నిరుద్యోగుల ఆత్మహత్యలను సీఎం చేసిన హత్యలుగానే బీజేపీ భావిస్తోందని అన్నారు బండి. లక్షా 7వేల ఖాళీలు భర్తీ చేస్తానని కేసీఆర్ నమ్మబలికి నిరుద్యోగులను మోసం చేశారని మండిపడ్డారు. ఇచ్చిన హామీలను నిలబెట్టుకోకపోవడం వల్లే ఆత్మహత్యలు జరుగుతున్నాయని చెప్పారు. బంగారు తెలంగాణ సాధనకోసం అందరం కలిసి మహోద్యమం నిర్మిద్దామని పిలుపునిచ్చారు.

ఇటు.. ధరణి పోర్టల్ ప్రారంభమై రెండేళ్లయినా సమస్యలు మాత్రం తీరలేదన్నారు సంజయ్. సీఎం మాటలకు.. చేతలకు పొంతన లేకుండా పోయిందని ఆరోపించారు. రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది రైతులు, మాజీ సైనికాధికారులు సహా ప్రజలు అనేక కష్టాలు పడుతున్నా చర్యలు తీసుకోకపోవడం సిగ్గుచేటని విమర్శించారు. రాష్ట్రంలో ఉన్న మొత్తం భూముల్లో పోడు భూములు, పట్టా, అసైన్డు, ఇనాం భూములెన్ని అనే విషయాలపై ఇంతవరకు స్పష్టం చేయకపోవడం దారుణమన్నారు.

రాష్ట్రంలో సమగ్ర భూ సర్వే కోసం కేంద్ర ప్రభుత్వం వందల కోట్ల నిధులు మంజూరు చేసినా.. ఇప్పటికీ ఆ దిశగా చర్యలు తీసుకోకపోవడం బాధాకరమని అన్నారు బండ. కేంద్ర నిధులను దారి మళ్లిస్తూ తన కుటుంబం, బినామీ సంస్థలకు ఉపయోగపడేలా.. ధరణి పోర్టల్ ను తీర్చారని ఆరోపించారు. అసైన్డు భూముల రైతులకు శాశ్వత హక్కులు కల్పించాలని హైకోర్టు రెండు సార్లు తీర్పులిచ్చినా పట్టించుకున్న దాఖలాల్లేవన్నారు. ధరణి పోర్టల్.. ప్రజా సమస్యల పరిష్కారానికా.. వేల కోట్ల రూపాయల విలువైన భూములను దండుకోవడానికా అని ప్రశ్నించారు. ఇప్పటికైనా సీఎం స్పందించి.. రెవెన్యూ చట్టాలు, ధరణి పోర్టల్ లో ఎదురవుతున్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు బండి సంజయ్.

tolivelugu news - follow on google news
tolivelugu app download


Primary Sidebar

తాజా వార్తలు

పెళ్లి మండ‌పంలోనే ప్రియుడి ఆత్మ‌హ‌త్య‌

ఒకే గ్రౌండ్ లో క్రికెట్ ఆడిన మహేష్, గోపీచంద్

గాడ్ ఫాదర్ గా చిరంజీవి.. ఫస్ట్ లుక్ అదుర్స్

అచ్చెన్న సారీ: అలా జ‌రుగుతుంద‌నుకోలేదు…కిష‌న్ రెడ్డి

శ్వేతా చౌదరి కేసులో కొత్త కోణం

సర్వీస్ ఛార్జ్ విధించడం నిషేధం..

సైదిరెడ్డి.. ఎందుకీ కక్కుర్తి!

న‌గ‌రంలో భారీ వ‌ర్షం.. ఇబ్బందుల్లో ప్ర‌జ‌లు..

వారికి భ‌ర్త శ‌త్రువుతో స‌మానం..!!

బుమ్రా అకౌంట్లో మ‌రో రికార్డు..

కాఫీలు అందించిన ట్విట్ట‌ర్ సీఈవో..!!

చేత‌నైతే ప‌ట్టుకోండి చూద్దాం..!!

ఫిల్మ్ నగర్

ఒకే గ్రౌండ్ లో క్రికెట్ ఆడిన మహేష్, గోపీచంద్

ఒకే గ్రౌండ్ లో క్రికెట్ ఆడిన మహేష్, గోపీచంద్

గాడ్ ఫాదర్ గా చిరంజీవి.. ఫస్ట్ లుక్ అదుర్స్

గాడ్ ఫాదర్ గా చిరంజీవి.. ఫస్ట్ లుక్ అదుర్స్

ఆర్ ఆర్ ఆర్ ఒక ‘గే ల‌వ్ స్టోరీ’ : ఆస్కార్ గ్ర‌హీత‌

ఆర్ ఆర్ ఆర్ ఒక ‘గే ల‌వ్ స్టోరీ’ : ఆస్కార్ గ్ర‌హీత‌

కాళీ పోస్టర్ వివాదాస్పదం... !

కాళీ పోస్టర్ వివాదాస్పదం… !

సినీ నటి మీనా సంచలన నిర్ణయం ?

సినీ నటి మీనా సంచలన నిర్ణయం ?

నరేష్ పవిత్ర లోకేష్ ల మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా ? షాక్ అవ్వాల్సిందే!!

నరేష్ పవిత్ర లోకేష్ ల మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా ? షాక్ అవ్వాల్సిందే!!

షూటింగ్ లో ప్రమాదం.. హీరో విశాల్ కు తీవ్ర గాయాలు..

షూటింగ్ లో ప్రమాదం.. హీరో విశాల్ కు తీవ్ర గాయాలు..

అన‌సూయ స్థానంలో కొత్త యాంక‌ర్..!

అన‌సూయ స్థానంలో కొత్త యాంక‌ర్..!

Download Tolivelugu App Now

tolivelugu app download

Copyright © 2022 · Tolivelugu.com

About Us | Disclaimer | Contact Us | Feedback | Advertise With Us | Privacy Policy | Sitemap | News Sitemap

ToliVelugu News provide Latest Telugu Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, Telangana and AP News Headlines Live, Latest Telugu News Online (తెలుగు తాజా వార్తలు)