[sonaar_audioplayer artwork_id=”” feed=”https://tolivelugu.com/wp-content/uploads/2022/04/bandi-warning.mp3″ player_layout=”skin_float_tracklist” hide_progressbar=”default” display_control_artwork=”false” hide_artwork=”false” show_playlist=”false” show_track_market=”false” show_album_market=”false” hide_timeline=”false”][/sonaar_audioplayer]
– సుష్మాస్వరాజ్ లేకుంటే తెలంగాణ వచ్చేదా?
– మీకొచ్చిన పదవులు బీజేపీ పెట్టిన భిక్ష కాదా?
– గులాబీ నేతలు ఇతరుల చావును కోరుకునే మూర్ఖులు
– 10వ రోజు ప్రజా సంగ్రామ యాత్రలో బండి
– కృష్ణంపల్లి చౌరస్తా దగ్గర 100 కిలోమీటర్ల పాదయాత్ర పూర్తి
– పూలు జల్లి, కేక్ కట్ చేసి సంబురాలు చేసుకున్న బీజేపీ శ్రేణులు
టీఆర్ఎస్ భిక్షవల్లే బండి సంజయ్ కు రాష్ట్ర అధ్యక్ష పదవి వచ్చిందని కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై దుమారం చెలరేగింది. కేటీఆర్ ను టార్గెట్ చేస్తూ బీజేపీ నేతలు విమర్శల దాడి కొనసాగిస్తున్నారు. తాజాగా బండి కూడా స్పందించారు. “ప్రపంచంలోనే అత్యధిక సభ్యత్వమున్న పార్టీ బీజేపీ. నరేంద్రమోడీ ఆధ్వర్యంలో నీతివంతమైన పాలన అందిస్తున్న పార్టీ. మీది తోక పార్టీ. దొంగ దీక్షలు, దొంగ హామీలతో మోసం చేసి అధికారంలోకి వచ్చిన పార్టీ. అవినీతి అక్రమాలకు కేరాఫ్ అడ్రస్ కేసీఆర్. కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడే సహారా, ఈఎస్ఐ స్కాంలకు పాల్పడితే సీబీఐ విచారణ జరిగింది. మీరా దేశం, ధర్మం కోసం పనిచేస్తున్న బీజేపీపై విమర్శలు చేసేది. మీకా నైతిక అర్హతే లేదు” అంటూ మండిపడ్డారు.
10వ రోజు ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గం అమరచింత మండలంలో పాదయాత్ర చేశారు. కృష్ణంపల్లి చౌరస్తా దగ్గర వంద కిలోమీటర్ల పాదయాత్ర పూర్తయింది. ఈ సందర్భంగా అభిమానులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు సంజయ్ పై పూలు జల్లి, కేక్ కట్ చేసి సంబురాలు జరుపుకున్నారు. ఇతర పార్టీలకు చెందిన స్థానిక నాయకులు, కార్యకర్తలు సంజయ్ సమక్షంలో బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా వారిని ఉద్దేశించి ప్రసంగించారు బండి.
తెలంగాణ కోసం కొట్లాడిన పార్టీ బీజేపీ అని… వందల మంది యువకులు చనిపోతుంటే… మీరు బలిదానం చేయొద్దు.. తెలంగాణ రాబోతుందంటూ ప్రకటన చేయడమే కాకుండా పార్లమెంట్ లో బిల్లు పెట్టేలా ఒత్తిడి తెచ్చి రాష్ట్రం వచ్చేలా చేసిన వ్యక్తి సుష్మాస్వరాజ్ అని గుర్తు చేశారు. ఆనాడు ఆమెను తెలంగాణ ఆడ పడుచుగా పొగిడిన కేసీఆర్.. ఈరోజు కనీసం ఆ ప్రస్తావన తీసుకురాకపోవడం సిగ్గు చేటని మండిపడ్డారు. తెలంగాణ రావడం వల్లే కేసీఆర్ కు సీఎం, ఆ పార్టీ నేతలకు పదవులు వచ్చాయని.. టీఆర్ఎస్ నేతలకు పదవులు బీజేపీ పెట్టిన భిక్ష అని గుర్తుంచుకోవాలని కౌంటర్ ఇచ్చారు.
“రెండో విడత ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా 100 కిలో మీటర్లు నడిచి ప్రజలందరినీ కలుస్తూ వారి సమస్యలను తెలుసుకుంటుండం అనందంగా ఉంది. ఈ యాత్రను దిగ్విజయంగా పూర్తి చేయడానికి కృషి చేసిన పాదయాత్ర ప్రముఖ్, సహ ప్రముఖ్ లు సహా సంగ్రామ సేన, ఇతర విభాగాల బాధ్యులందరికీ ధన్యవాదాలు. ప్రజల సమస్యలను తెలుసుకోవడంతోపాటు కేసీఆర్ మోసాలను ఎండగట్టేందుకు, కేంద్ర పథకాలను వివరించేందుకే పాదయాత్ర చేస్తున్నా. కేసీఆర్ సినిమాల్లో విలన్ కు మించిన నటుడు. సినిమావాళ్లు కేవలం నటిస్తారు. కానీ కేసీఆర్ జీవిస్తారు. దొంగ దీక్ష చేసినా, దొంగ హామీలిచ్చినా జీవిస్తూ నిజమని నమ్మిస్తూ ప్రజలను మోసం చేస్తున్నడు. టీఆర్ఎస్ లో కొందరు మూర్ఖులు నేను తంబాకు తింటానని విష ప్రచారం చేస్తున్నరు. నేను నమిలేది లవంగా. మద్యం, డ్రగ్స్ అలవాటున్నది టీఆర్ఎస్ నేతలకే. కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యులు వెంట్రుకలను పరీక్షిస్తే డ్రగ్స్ భాగోతం బయటపడతది. ఇతరుల చావును కోరుకునే మూర్ఖులు టీఆర్ఎస్ వాళ్లు. బండి సంజయ్ చస్తే కూడా రైతు బీమా వస్తుందంటూ నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నరు. నాకు గుంట భూమి లేదు. రైతు బీమా ఎట్లిస్తరు? నాచావును కోరుకునే మూర్ఖులకే ఆ ఇన్సూరెన్స్ డబ్బులిస్తా. రుణమాఫీ అమలు చేయకుండా రైతులను గోస పెడుతున్నడు కేసీఆర్. ఆయన అరాచకాలపై పోరాడదాం రండి. ఎత్తిన జెండా దించకండి. తెగించి కొట్లాడండి. గోల్కొండ కోటపైన కాషాయ జెండా ఎగరేసేదాకా ఉద్యమిద్దాం” అంటూ పిలుపునిచ్చారు బండి సంజయ్.