స్వదేశంలో వెస్టిండీస్ తో జరగబోయే వన్డే, టీ20 సిరీస్ లకు బీసీసీఐ భారత జట్టును ప్రకటించింది. రెండు ఫార్మాట్లకు కెప్టెన్ గా రోహిత్ శర్మ, వైస్ కెప్టెన్ గా కేఎల్ రాహుల్ వ్యవహరించనున్నట్లు వెల్లడించింది. అయితే.. కేఎల్ రాహుల్ రెండో వన్డే నుంచి అందుబాటులో ఉండనున్నట్లు తెలిపింది. ఆల్ రౌండర్ జడేజా ప్రస్తుతం మోకాలి గాయం కారణంగా విండీస్ తో జరిగే వన్డే, టీ20 సిరీస్ లలో అతనికి రెస్ట్ ఇస్తున్నట్టు బీసీసీఐ ప్రకటించింది. జస్ప్రిత్ బుమ్రా, మహమ్మద్ షమీలకు విశ్రాంతినిచ్చినట్లు వెల్లడించింది.
విండీస్ తో జరిగే ఈ రెండు ఫార్మాట్ లకు గానూ.. మొత్తం 18 మందితో కూడిన భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. రవి బిష్ణోయ్ కి తొలిసారి బీసీసీఐ పిలుపునందించింది. విండీస్ తో సిరీస్ కు ఆల్ రౌండర్ రిషి ధావన్ ను ఎంపిక చేయనున్నట్లు ప్రచారం జరిగినప్పటికీ.. అతనికి టీమ్ లో చోటు దక్కలేదు. మరో ఆల్ రౌండర్ కు హార్దిక్ పాండ్యాను కూడా పూర్తి ఫిట్ గా లేని కారణంగా సిరీస్ కు దూరంగా ఉంచారు. విండీస్ తో మూడు వన్డేల సిరీస్ లో భాగంగా తొలి వన్డే ఫిబ్రవరి 6న గుజరాత్ అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరగనుంది. ఫిబ్రవరి 9న రెండో వన్డే, 11న మూడో వన్డే అదే స్టేడియంలో జరగనున్నాయి. ఇక ఫిబ్రవరి 16,18,20 తేదీల్లో మూడు టీ20 మ్యాచ్ లు కోల్ కతాలోని ఈడెన్ గార్డెన్స్ మైదానంలో జరగనున్నాయి.
రోహిత్ శర్మ సారధ్యంలో జరిగే వన్ డే సిరీస్ కు కేఎల్ రాహుల్ వైస్ కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు. రుతురాజ్ గైక్వాడ్, శిఖర్ ధావన్, విరాట్ కోహ్లి, సూర్య కుమార్ యాదవ్, శ్రేయస్ అయ్యర్, దీపక్ హుడా, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), చహర్, శార్దూల్ ఠాకూర్, యజువేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, ఆవేశ్ ఖాన్ లతో కూడిన టీమ్ ను ప్రకటించింది బీసీసీఐ.
టీ20 సిరీస్ కు ఆడనున్న జట్టులో రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), ఇషాన్ కిషన్, విరాట్ కోహ్లి, శ్రేయాస్ అయ్యర్, సూర్య కుమార్ యాదవ్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), వెంకటేశ్ అయ్యర్, దీపక్ చహర్, శార్దూల్ ఠాకూర్, రవి బిష్ణోయ్, అక్షర్ పటేల్, యజువేంద్ర చహల్, వాషింగ్టన్ సుందర్, మహమ్మద్ సిరాజ్, భువనేశ్వర్, ఆవేశ్ ఖాన్, హర్షల్ పటేల్ గా టీమ్ బీసీసీఐ ప్రకటించింది