ఆటగాళ్ళకు బీసీసీఐ కొత్త కాంట్రాక్ట్ ల జాబితాను విడుదల చేసింది. తాజాగా.. విడుదలైన ఈ జాబితాలో మాజీ టెస్ట్ కెప్టెన్ అజింక్యా రహానే, చతేశ్వర్ పుజారాలు ‘ఏ’ గ్రేడ్ నుంచి ‘బీ’ గ్రేడ్ కు చేరారు.
ఫామ్ లో లేకపోవడం వల్ల వీరిద్దరూ శ్రీలంకతో జరిగే టెస్ట్ సిరీస్ లోనూ స్థానం కోల్పోయారు. మరో స్టార్ ఆటగాడు, ఆల్ రౌండర్ హార్థిక్ పాండ్యా కూడా ‘ఏ’ గ్రేడ్ లో స్థానం కోల్పోయాడు.
గాయాలతో బాధపడుతున్న హార్థిక్ ‘ఏ’ గ్రేడ్ నుంచి ‘సీ’ గ్రేడ్ కు పడిపోయాడు. వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా ‘బీ’ గ్రేడ్ నుంచి ‘సీ’ గ్రేడ్ కు తగ్గింది.
మరోవైపు.. బీసీసీఐ కాంట్రాక్టుల జాబితాలో నాలుగు స్థానాలు ఉంటాయి. ఏ++ కు బీసీసీఐ 7 కోట్ల రెమ్యూనరేన్ చెల్లిస్తోంది. అలాగే.. ఏ, బీ, సీ గ్రేడ్ లకు రూ. 5 కోట్లు, రూ. 3కోట్లు, ఒక కోటి రెమ్యూనరేషన్ చెల్లిస్తుంది.