గూగుల్ క్రోమ్ యూజర్లకు కేంద్ర ఎలక్ట్రానిక్స్, సమాచార శాఖ పరిధిలోని కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ హెచ్చరిక జారీ చేసింది. గూగుల్ క్రోమ్ దాడులకు హ్యాకర్లు పాల్పడుతున్నట్టు పేర్కొంది. గూగుల్ క్రోమ్ లోని లోపాలను అనుకూలంగా చేసుకుని.. ఎంపిక చేసుకున్న కంప్యూటర్లపై దాడిగి దిగుతున్నట్టు తెలిపింది.
దీంతో క్రోమ్ యూజర్ల రక్షణ ప్రమాదంలో పడుతుందని పేర్కొంది. క్రోమ్ 98.0.4758.80 వెర్షన్ కంటే ముందు వెర్షన్లలోనే ఈ సమస్య అధికంగా తలెత్తుతున్నట్టు సీఈఆర్టీ వెల్లడించింది. మరోవైపు గూగుల్ ఇప్పటికే అప్ డేటెడ్ వెర్షన్ ద్వారా ఈ లోపాలను సరి చేసిందని పేర్కొంది.
అది 27 సెక్యూరిటీ అంశాలకు పరిష్కారం చూపించిందని తెలిపింది. యూజర్లు గూగుల్ కొత్త వెర్షన్ కు అప్ డేట్ కావాలని సదరు సంస్థ సూచించింది. విండోస్ యూజర్లు అయితే గూగుల్ క్రోమ్ తాజా వెర్షన్ 98.0.4758.80/81/82 ను డౌన్ లోడ్ చేసుకోవాలని తెలిపింది.
మ్యాక్, లైనక్స్ యూజర్లు 98.0.4758.80 వెర్షన్ ను డౌన్ లోడ్ చేసుకోవాలని గూగుల్ సూచించింది. చాలా వరకు లోపాలకు పరిష్కారం చూపించినట్టు తెలిపింది. యాకర్లు ఎప్పుడు ఏ మార్గంలో అయినా ప్రవేశించడానికి అవకాశం ఉన్నట్టు పేర్కొంది.