భద్రాద్రి సీతారామచంద్ర స్వామి కల్యాణోత్సవానికి ముహూర్తం ఖరారైంది. ప్రతి సంవత్సరం ఎంతో వైభవంగా ఈ కల్యాణం జరుగుతోంది. ఈ సంవత్సరం సీతారాముల కల్యాణం మార్చి 30వ తేదీన నిర్వహిస్తున్నట్లు వైదిక కమిటీ నిశ్చయించింది.
అదే విధంగా మార్చి 31న పుష్కర సామ్రాజ్య పట్టాభిషేక మహోత్సవాన్ని నిర్వహిస్తామని కమిటీ పేర్కొంది. ఈ ఏడాది జరిగే పట్టాభిషేకానికి ప్రత్యేకత ఉందని కమిటీ సభ్యులు చెప్పారు.
12 ఏళ్లకు ఒకసారి వచ్చే పట్టాభిషేకమని తెలిపారు. మార్చి 22 నుంచి ఏప్రిల్ 5 వరకు వసంత పక్ష ప్రయుక్త శ్రీరామనవమి తిరు కల్యాణ సన్నాహిక బ్రహ్మోత్సవాలు జరపాలని ఆలయ వైదిక కమిటీ పెద్దలు నిర్ణయించారు.
ఇటీవల భద్రాద్రిలో లడ్డూల నాణ్యతపై వివాదం తలెత్తిన సందర్భంగా శ్రీరామ నవమికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని భక్తులు కోరుతున్నారు.