• Skip to main content
  • Skip to secondary menu
  • Skip to primary sidebar
tolivelugu-logo-removebg-preview

Tolivelugu తొలివెలుగు

Tolivelugu News provide Latest Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, TG and AP News Headlines Live (తెలుగు తాజా వార్తలు), Telugu News Online (తెలుగు తాజా వార్తలు)

tolivelugu facebook tolivelugu twitter tolivelugu instagram tolivelugu tv subscribe nowtolivelugu-app
  • తెలుగు హోమ్
  • వీడియోస్
  • రాజకీయాలు
  • వేడి వేడిగా
  • ఫిలిం నగర్
  • E-Daily
  • చెప్పండి బాస్
  • ENGLISH
Tolivelugu Latest Telugu Breaking News » Scrolling » మీరు చెప్పేది వినడానికే వచ్చా.. పంజాబ్ లో రాహుల్

మీరు చెప్పేది వినడానికే వచ్చా.. పంజాబ్ లో రాహుల్

Last Updated: January 11, 2023 at 5:47 pm

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ‘భారత్ జోడో యాత్ర’ పంజాబ్ లో కొనసాగుతోంది. బుధవారం పంజాబ్ లోని ఫతేహగ్ సాహిబ్ లో రాహుల్ గాంధీ యాత్ర చేపట్టారు. ఈ యాత్రకి పంజాబ్ లో భారీ స్థాయిలో స్పందన వచ్చింది. పెద్ద ఎత్తున స్థానికులు, కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. అనంతరం సభలో రాహుల్ మాట్లాడుతూ.. ఈ యాత్రలో మేము సుదీర్ఘ ప్రసంగాలు చేయము. ఈ యాత్ర మాట్లాడేందుకు కాదు.. ప్రజలు చెప్పేది వినేందుకు చేపట్టామన్నారు.

Rahul Gandhi starts Punjab leg of Bharat Jodo Yatra in Fatehgarh Sahib, takes a jab at BJP | Cities News,The Indian Express

మేము రోజూ ఉదయం 6 గంటలకు నిద్ర లేచి, దాదాపు 25 కిలోమీటర్లు నడుస్తామన్నారు. 6-7 గంటలు మీరందరూ చెప్పేది వింటాం. 10-15 నిమిషాల పాటు మా ప్రణాళికలు ఏంటో చెబుతామన్నారు. ఈ యాత్ర లక్ష్యం ప్రజలు చెప్పేది వినడమే. దేశంలో పెరిగిన ద్వేషం, హింస, నిరుద్యోగం, ద్రవ్యోల్బణం వంటి అంశాలను లేవనెత్తి, ఆ సమస్యలకు వ్యతిరేకంగా ఆ యాత్ర ద్వారా పోరాటం చేయడమేనని పేర్కొన్నారు.

దేశంలో బీజేపీ ప్రజల మధ్య ద్వేషాన్ని, భయాన్ని వ్యాప్తి చేస్తోందని ఆరోపించారు. దేశం మత సామరస్యం, ఐక్యత, గౌరవానికి సూచిన అని చెప్పారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేస్తున్న భారత్ జోడో యాత్ర పంజాబ్ లో కొనసాగుతోంది. భారత్ జోడో యాత్రకు బీజేపీ పాలిత కర్ణాటకలో పెద్దగా స్పందన రాదని అనుకున్నారని.. కానీ తమిళనాడు, కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర, హర్యానా, మధ్య ప్రదేశ్ లో జోడో యాత్రకు మంచి ఆదరణ లభించిందన్నారు.

దేశంలో ద్వేషం, హింసాత్మక వాతావరణం వ్యాపించిందన్నారు. బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ లు దేశాన్ని విభజించడానికి పూనుకున్నాయని ఆరోపించారు. ఒక మతం మరో మతానికి వ్యతిరేకంగా పోరాడేలా చేయడమన్నారు. ఒక భాషకు వ్యతిరేకంగా మరో భాషను ఇరకాటంలో పెట్టేందుకు బీజేపీ నేతలు, ఆర్ఎస్ఎస్ ప్రయత్నిస్తోందన్నారు. కాబట్టి దేశానికి ప్రత్యామ్నాయ మార్గాన్ని చూపాలని భావించి ఈ యాత్ర ప్రారంభించామని వెల్లడించారు రాహుల్ గాంధీ.

Primary Sidebar

తాజా వార్తలు

పార్క్ చేసిన బైక్ ను 3 కిలో మీటర్ల దూరం లాక్కెళ్ళిన బే’కారు’..!

ఉద్యోగులకు బైజూస్ షాక్… ఈ సారి ఫ్రెషర్లందరినీ ఇంటికి ….!

ఆయన మృతి చిత్ర పరిశ్రమకు తీరని లోటు!

గాంధీ భవన్ వద్ద ఉద్రిక్తత.. కాంగ్రెస్ నేతలను అడ్డుకున్న పోలీసులు!

బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ ఏం మాట్లాడారంటే!

అమెరికాలో స్పై బెలూన్ కలకలం… డ్రాగన్ కంట్రీ గూఢచర్యం చేస్తోందన్న అమెరికా…!

రూ. 9.5 లక్షల విలువైన నకిలీ నాణేల గుట్టురట్టు …!

రామ మందిరం పేల్చేస్తామంటూ ఫోన్ కలకలం

కే విశ్వనాథ్ ఖాకీ డ్రెస్సు వెనుక స్టోరీ ఏంటంటే?

వరంగల్‌ లో భారీ అగ్ని ప్రమాదం..కోటి రూపాయల నష్టం!

పరుపులను ఫలహారంగా తింటున్న అమెరికా అమ్మాయి…!

కార్యకర్తలే మా సంపద!

ఫిల్మ్ నగర్

ఆయన మృతి చిత్ర పరిశ్రమకు తీరని లోటు!

ఆయన మృతి చిత్ర పరిశ్రమకు తీరని లోటు!

కే విశ్వనాథ్ ఖాకీ డ్రెస్సు వెనుక స్టోరీ ఏంటంటే?

కే విశ్వనాథ్ ఖాకీ డ్రెస్సు వెనుక స్టోరీ ఏంటంటే?

కళాతపస్వికి మోడీ నివాళులు!

కళాతపస్వికి మోడీ నివాళులు!

శంకరాభరణం విడుదలైన రోజే.. విశ్వనాథ్‌ కన్నుమూత!

శంకరాభరణం విడుదలైన రోజే.. విశ్వనాథ్‌ కన్నుమూత!

కళాతపస్వికి ప్రముఖుల నివాళులు!

కళాతపస్వికి ప్రముఖుల నివాళులు!

కళాతపస్వికి ''ఎస్‌'' అనే సెంటిమెంట్‌ ఎందుకంటే!

కళాతపస్వికి ”ఎస్‌” అనే సెంటిమెంట్‌ ఎందుకంటే!

టాలీవుడ్ లో విషాదం.. కళాతపస్వి విశ్వనాథ్ కన్నుమూత!

టాలీవుడ్ లో విషాదం.. కళాతపస్వి విశ్వనాథ్ కన్నుమూత!

నటి పాకీజా, కెమెరా మేన్ దేవరాజ్ లకు చిరంజీవి ఆపన్న హస్తం..!

నటి పాకీజా, కెమెరా మేన్ దేవరాజ్ లకు చిరంజీవి ఆపన్న హస్తం..!

Download Tolivelugu App Now

tolivelugu app download

Copyright © 2023 · Tolivelugu.com

About Us | Disclaimer | Contact Us | Feedback | Advertise With Us | Privacy Policy | Sitemap | News Sitemap