పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా ప్రధాన పాత్రలలో సాగర్ కె.చంద్ర దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం భీమ్లా నాయక్. మలయాళంలో సూపర్ హిట్ సాధించిన అయ్యప్పనుమ్ కోషి చిత్రానికి రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో నిత్యామీనన్, సంయుక్త మీనన్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు.
అలాగే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ మాటలు అందిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన సాంగ్స్ అన్ని కూడా ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. కాగా తాజాగా ఈ సినిమాకు సంబంధించిన చివరి షెడ్యూల్ ప్రస్తుతం వికారాబాద్ లో జరుగుతోంది. అయితే షూటింగ్ స్పాట్ కి పవన్ కళ్యాణ్ వెళ్తున్న వీడియో లతోపాటు షూటింగ్ కు సంబంధించిన వీడియోలు కూడా కొన్ని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇక ఎస్.ఎస్ తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజ్ కాబోతున్న సంగతి తెలిసిందే.