పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా ప్రధాన పాత్రలలో సాగర్ కే చంద్ర దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం భీమ్లా నాయక్. భారీ అంచనాలతో తెరకెక్కిన ఈ చిత్రం మలయాళంలో సూపర్ హిట్ సాధించిన అయ్యప్పనుమ్ కోషి చిత్రానికి రీమేక్ గా తెరకెక్కుతోంది. ఇక ఈ సినిమాలో నిత్యామీనన్ సంయుక్త మీనన్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు.
ఇక ఇప్పటికే విడుదలైన సాంగ్స్, లుక్స్ అన్నీ విశేషంగా ఆకట్టుకున్నాయి. అయితే జనవరి 12న రిలీజ్ కావాల్సిన ఈ చిత్రం ఫిబ్రవరి 25కు వాయిదా పడింది. అయితే ఇప్పుడు ఈ రిలీజ్ డేట్ పై కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
కరోనా పరిస్థితులు దృష్ట్యా ఈ సినిమా రిలీజ్ డేట్ చేంజ్ చేయాలని చూస్తున్నారట. కొత్త రిలీజ్ డేట్ ఫిబ్రవరి రెండవ వారంలో ప్రకటించనున్నారట. ఇక ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తుండగా సితార ఎంటర్టైన్మెంట్ వారు నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.