పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. రానా దగ్గుబాటి కలిసి నటించిన మల్టీస్టారర్ మూవీ భీమ్లా నాయక్.. ఫిబ్రవరి 25న విడుదలై బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించింది. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న పవన్ అభిమానులకు ఫుల్ మీల్స్ ఇచ్చేశారు మేకర్స్. త్రివిక్రమ్ పవర్ ఫుల్ డైలాగ్స్.. పవర్ స్టార్ యాక్షన్ సీన్లకు రికార్డులు బద్దలయ్యాయి.
ఇప్పుడు ఈ చిత్రం ఓటీటీలో సందడి చేసేందుకు సిద్ధం అయింది. దీంతో డిజిటల్ ప్రేక్షకులకు డబుల్ బొనాంజా ఇవ్వనున్నారు మూవీ మేకర్స్. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ తో పాటు.. ఆహా ఓటీటీ ప్లాట్ ఫాంలలో ఒకేరోజున స్ట్రీమింగ్ కానున్నట్టు మేకర్స్ అధికారింగా ప్రకటించారు.
మలయాళం సూపర్ హిట్ అయ్యప్పనుమ్ కోషియం తెలుగు రీమేక్ గా తెరకెక్కిన ఈ మూవీ.. బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఎన్నో వాయిదాల తర్వాత ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా.. భారీ విజయాన్ని అందుకొని రికార్డుల కలెక్షన్స్ రాబట్టుకుంది
డైరెక్టర్ సాగర్ కే చంద్ర దర్శకత్వం వహించిన ఈ మూవీలో పవన్ సరసన నిత్యా మీనన్ హీరోయిన్ గా నటించగా.. రానాకు జోడీగా సంయుక్త మీనన్ నటించింది. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశి నిర్మించిన ఈ సినిమాకు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ మాటలు అందించారు.