• Skip to main content
  • Skip to secondary menu
  • Skip to primary sidebar
tolivelugu-logo-removebg-preview

Tolivelugu తొలివెలుగు

Tolivelugu News provide Latest Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, TG and AP News Headlines Live (తెలుగు తాజా వార్తలు), Telugu News Online (తెలుగు తాజా వార్తలు)

tolivelugu facebook tolivelugu twitter tolivelugu instagram tolivelugu tv subscribe nowtolivelugu-app
  • తెలుగు హోమ్
  • వీడియోస్
  • రాజకీయాలు
  • వేడి వేడిగా
  • ఫిలిం నగర్
  • E-Daily
  • చెప్పండి బాస్
  • ENGLISH
Tolivelugu Latest Telugu Breaking News » Top News » భోపాల్ గ్యాస్ ట్రాజెడీ.. కేంద్రం పిటిషన్ కు ‘సుప్రీం’ తిరస్కృతి

భోపాల్ గ్యాస్ ట్రాజెడీ.. కేంద్రం పిటిషన్ కు ‘సుప్రీం’ తిరస్కృతి

Last Updated: March 14, 2023 at 12:30 pm

భోపాల్ గ్యాస్ బాధితులకు యూనియన్ కార్బైడ్ కార్పొరేషన్ నుంచి అదనంగా మరింత పరిహారం ఇప్పించాలని కోరుతూ కేంద్రం దాఖలు చేసిన క్యూరేటివ్ పిటిషన్ ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. 1984 లో భోపాల్ లో యూనియన్ కార్బైడ్ ఫ్యాక్టరీ నుంచి వెలువడిన అత్యంత విషపూరితమైన గ్యాస్ కారణంగా మూడు వేలమందికి పైగా మరణించగా అనేకమంది అస్వస్థులయ్యారు. 1989 లో కుదిరిన సెటిల్మెంట్ ద్వారా యూనియన్ కార్బైడ్ సంస్థ 470 మిలియన్ డాలర్లను పరిహారంగా చెల్లించినప్పటికీ.. ఇది కాకుండా ఈ సంస్థ నుంచి, దీని అనుబంధ సంస్థల నుంచి అదనంగా రూ. 7,400 కోట్లను చెల్లించాలని ఆదేశించాలని కోర్టును కోరుతూ కేంద్రం ఈ పిటిషన్ దాఖలు చేసింది.

Bhopal gas tragedy: SC dismisses Centre's plea for additional compensation for victims - BusinessToday

ప్రస్తుతం యూనియన్ కార్బైడ్ ఫ్యాక్టరీని డౌవ్ కెమికల్స్ నిర్వహిస్తోంది. ఈ కేసును తిరగదోడాలన్న కేంద్రం అభ్యర్థనపై స్పందించిన కోర్టు.. 1989 లో ఫైనల్ సెటిల్మెంట్ కుదిరిన తరువాత ఈ వివాదాన్ని మళ్ళీ తిరగదోడజాలమని పేర్కొంది. 1989 నుంచి రూపాయి విలువ తగ్గుతున్నందున ఆ కారణంగా పరిహారాన్ని పెంచాలనడం అర్థరహితమని వివరించింది. బాధితులకు పరిహారాన్ని పంపిణీ చేయకుండా ఇంకా రూ. 50 కోట్లు రిజర్వ్ బ్యాంక్ వద్ద నిరుపయోగంగా పడి ఉన్నాయని కోర్టు ఆందోళన వ్యక్తం చేసింది.

రివ్యూ పిటిషన్ దాఖలు చేయకుండా మీరు నేరుగా క్యూరేటివ్ పిటిషన్ ఎలా వేస్తారని కేంద్రాన్ని ప్రశ్నించింది. రెండు దశాబ్దాల తరువాత కేంద్ర ప్రభుత్వం ఎలాంటి హేతుబధ్ధత లేకుండా ఈ సమస్యను లేవనెత్తడం తమను అసంతృప్తికి గురి చేసిందని తీవ్రంగా మందలించినంత పని చేసింది.

క్యూరేటివ్ పిటిషన్లను విచారించజాలమని జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్ ఆధ్వర్యంలోని ధర్మాసనం పేర్కొంది. అయిదుగురు సభ్యులతో కూడిన ఈ రాజ్యాంగ ధర్మాసనంలో ఇంకా న్యాయమూర్తులు సంజీవ్ ఖన్నా, అభయ్ ఎస్. ఓకా, విక్రమ్ నాథ్, జేకే. మహేశ్వరి సభ్యులుగా ఉన్నారు. ఈ కేసుకు సంబంధించి కోర్టు తన ఉత్తర్వులను గత జనవరి 12 న రిజర్వ్ లో ఉంచింది. మొత్తానికి ఈ కేసులో సుప్రీంకోర్టు నుంచి కేంద్రానికి చుక్కెదురైంది.

Primary Sidebar

తాజా వార్తలు

పనివాడికి 10 కోట్ల లాటరీ…!

సూర్య@ చెన్నై టూ ముంబై..ఖరీదైన ఇల్లు కొనుగోలు..!

బాలయ్యకు జోడీగా కాజల్ అగర్వాల్ రీ ఎంట్రీ..!

ఉగాదికి వస్తున్నాడోయ్ మన రంగమార్తాండ..!

ఏజెంట్ కు నాటు హీరోల ప్రమోషన్…!

నేను అలా చెప్పడం ఆపను.. రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు..!

10 గంటలు.. పదుల్లో ప్రశ్నలు

అయోధ్యలో ఘనంగా ‘శ్రీరామ నవమి’ వేడుకలు

ధీరేంద్ర స్వామీజి‘ దివ్య దర్బార్’లో భారీ చోరీ…!

బీఆర్ఎస్ శ్రేణులకు సీఎం కేసీఆర్ బహిరంగ లేఖ

తుస్సుమన్న కేజ్రీవాల్ యత్నం.. థర్డ్ ఫ్రంట్ ‘మిథ్య’ !

ఇంకా ఈడీ ఆఫీస్ లోనే కవిత

ఫిల్మ్ నగర్

సూర్య@ చెన్నై టూ ముంబై..ఖరీదైన ఇల్లు కొనుగోలు..!

సూర్య@ చెన్నై టూ ముంబై..ఖరీదైన ఇల్లు కొనుగోలు..!

బాలయ్యకు జోడీగా కాజల్ అగర్వాల్ రీ ఎంట్రీ..!

బాలయ్యకు జోడీగా కాజల్ అగర్వాల్ రీ ఎంట్రీ..!

ఉగాదికి వస్తున్నాడోయ్ మన రంగమార్తాండ..!

ఉగాదికి వస్తున్నాడోయ్ మన రంగమార్తాండ..!

ఏజెంట్ కు నాటు హీరోల ప్రమోషన్...!

ఏజెంట్ కు నాటు హీరోల ప్రమోషన్…!

డెవిల్ కి దడపుట్టించనున్న ఎల్నాజ్ నోరౌజీ స్పెషల్ సాంగ్ ...!

డెవిల్ కి దడపుట్టించనున్న ఎల్నాజ్ నోరౌజీ స్పెషల్ సాంగ్ …!

actress mrunal thakur movie remuneration

సీతమ్మ ఒక్క సినిమాకే అంత డిమాండా?

kangana warning board becomes talk of town

హద్దు మీరితే కాల్చిపడేస్తా!

wedding photos deleted is there a difference between niharika and chaitanya

మరోసారి తెర మీదకు మెగా డాటర్‌ విడాకుల మ్యాటర్!

Download Tolivelugu App Now

tolivelugu app download

Copyright © 2023 · Tolivelugu.com

About Us | Disclaimer | Contact Us | Feedback | Advertise With Us | Privacy Policy | Sitemap | News Sitemap