హైదరాబాద్ ఉపాధి కార్యాలయంలో ఈ నెల 24 న జాబ్మేళా నిర్వహించనున్నారు. ఈ మేరకు జిల్లా ఉపాధి అధికారి లక్ష్మణ్కుమార్ తెలిపారు. ఈమేళాలో కోటక్ బ్యాంకు, ఒప్పో మొబైల్స్, క్యూస్ క్రాప్, ఎల్పిఎఫ్ సిస్టిమ్స్, ఐడిబిఐ, కార్వీ ఫోర్డ్, శుభగ్రుహ ప్రాజెక్టు, పేరం గ్రూపు వంటి 12 కంపెనీలు పొల్గొంటున్నట్టు తెలిపారు. ఈ కంపెనీలో పనిచేయుటకు 800 ఉద్యోగాల ఎంపికకు జాబ్మేళా ఏర్పాటు చేస్తున్నారని, అభ్యర్ధులు పదవ తరగతి, ఇంటర్, ఐటిఐ, డిప్లొమా, బికాం, ఏదైనా డిగ్రీ చదివి ఉండాలని, వారిని ఫీల్డ్ సేల్స్, బిల్లింగ్ ఎగ్జిక్యూటివ్, అసిస్టెంట్ మేనేజర్, ఫాషన్ కన్సల్టెంట్, పైనాన్సియల్ అడ్వైజర్, కస్టమర్ సపోర్ట్, మార్కెటింగ్, బిజినెస్ ఎగ్జిక్యూటివ్, టెలికాలర్స్, కస్టమర్ సర్వీసు రిప్రజేంటివ్, సేల్స్ ట్రైనీస్, ప్రమోటర్స్, ఫీల్డ్ నెట్వర్క్, ఇంజనీర్స్ ఎంపిక చేయనున్నట్లు వెల్లడించారు.
ఎంపికైన వారికి నెలకు రూ. 10వేల నుండి, రూ.20వేలు వరకు జీతం ఉంటుందని, వయస్సు 19-35 సంవత్సరాలలోపు వారు రావచ్చని తెలిపారు . అర్హత ఆసక్తి ఉన్న నిరుద్యోగ యువతీ,యువకులు తమ బయోడేటాతో పాటు జిరాక్స్ సర్టిఫికేట్లతో మంగళవారం మల్లేపల్లి బాలుర ఐటిఐ క్యాంపస్ వద్ద నున్న ఉపాధి కార్యాలయం, మాడల్ కెరియర్ సెంటర్లో ఉదయం 10.30 గంటలకు జరుగు మేళాకు హాజరు కావల్సిందిగా కోరారు.