• Skip to main content
  • Skip to secondary menu
  • Skip to primary sidebar
tolivelugu-logo-removebg-preview

Tolivelugu తొలివెలుగు

Tolivelugu News provide Latest Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, TG and AP News Headlines Live (తెలుగు తాజా వార్తలు), Telugu News Online (తెలుగు తాజా వార్తలు)

tolivelugu facebook tolivelugu twitter tolivelugu instagram tolivelugu tv subscribe nowtolivelugu-app
  • తెలుగు హోమ్
  • వీడియోస్
  • రాజకీయాలు
  • వేడి వేడిగా
  • ఫిలిం నగర్
  • E-Daily
  • చెప్పండి బాస్
  • ENGLISH
Tolivelugu Latest Telugu Breaking News » Crime » వైశాలి కేసులో.. ట్విస్ట్ లే ట్విస్టులు!!

వైశాలి కేసులో.. ట్విస్ట్ లే ట్విస్టులు!!

Last Updated: December 10, 2022 at 2:02 pm

రంగారెడ్డి జిల్లా ఆదిభట్లలో జరిగిన యువతి కిడ్నాప్‌ వ్యవహారం తెలంగాణ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. పట్టపగలు దాదాపు 100 మందితో వచ్చిన మిస్టర్ టీ ఓనర్ నవీన్ రెడ్డి హంగామా చేసి.. డెంటల్ డాక్టర్ వైశాలిని కిడ్నాప్ చేయటంతో ఈ కేసు నగరమంతా చర్చనీయాంశంగా మారింది.

ఈ దాడిలో అడ్డువచ్చిన యువతి తల్లిదండ్రులతో పాటు పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ కేసును ఛాలెంజింగ్‌గా తీసుకున్న పోలీసులు.. 6 గంటల్లోనే రెస్క్యూ చేసి వైశాలిని కాపాడారు. ఫోన్ సిగ్నల్ ఆధారంగా యువతి ఏపీ తెలంగాణ బోర్డర్‌లో ఉందని గుర్తించి కిడ్నాపర్ల బారి నుంచి రక్షించారు.

కిడ్నాప్‌కు పాల్పడిన మిస్టర్ టీ ఓనర్‌ నవీన్ రెడ్డితో పాటు మరో 8 మందిని పోలీసులు అరెస్టు చేశారు. వైశాలి కుటుంబ సభ్యులపై దాడి, ఆస్తుల ధ్వంసంతో నిందితులపై పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే కిడ్నాప్ కేసులో ప్రధాన నిందితుడు నవీన్ రెడ్డి షాకింగ్ పోలీసులకు షాకింగ్ స్టేట్‌మెంట్ ఇచ్చాడు.

గతేడాది వైశాలితో తనకు పెళ్లి జరిగిందని స్టేట్‌మెంట్‌లో వెల్లడించారు. 2021 ఆగస్ట్‌లో తమకు హిందూ సంప్రదాయం ప్రకారం పెళ్లి జరిగిందని చెప్పాడు. 2021 ఆగస్ట్ 4న బాపట్ల జిల్లా వలపర్ల ఆలయంలో తమ వివాహం జరిగిందని చెప్పాడు.

అయితే బీడీఎస్ పూర్తయ్యే దాక పెళ్లి ఫొటోలను బయటకు రానీయవద్దని వైశాలి కండీషన్ పెట్టిందిని స్టేట్‌మెంట్‌లో వెల్లడించాడు. వైశాలి కండీషన్‌ మేరకే తాను ఫోటోలను లీక్ చేయలేదని నవీన్ రెడ్డి వెల్లడించారు. వైశాలి తల్లితండ్రులు కూడా బీడీఎస్ పూర్తవగానే పెళ్లి చేస్తామని మాట ఇచ్చారని, ఇప్పుడు ఆ మాట తప్పారని ఆరోపించారు.

వైశాలి కుటుంబ సభ్యులు పెళ్లి పేరు చెప్పి తనతో డబ్బులు ఖర్చు పెట్టించారన్నారు. తన డబ్బుతో వైజాగ్, అరకు, వంజంగి, మంగుళూరు, కూర్గ్, గోవా, గోకర్ణా వెళ్లారని చెప్పారు. వైశాలి పేరు మీద ఖరీదైన వోల్వో కారు, వైశాలి తండ్రి దామోదర్ రెడ్డి పేరు మీద రెండు కాఫీ షాపులను రిజిస్ట్రేషన్ చేయించినట్లు స్టేట్‌మెంట్‌లో నవీన్ రెడ్డి వెల్లడించారు.

Primary Sidebar

తాజా వార్తలు

ఈ నెల 29న బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం

పరీక్షా పే చర్చ నాకు కూడా ఓ పెద్ద పరీక్ష….!

భారత్ జోడో యాత్ర… రాహుల్‌ను కలిసిన ఒమర్ అబ్ధులా ..!

బీఆర్ఎస్ మహారాష్ట్ర బహిరంగ సభ షెడ్యూల్ ఇదే..!

జమునకు టాలీవుడ్‌, రాజకీయ ప్రముఖుల నివాళులు!

షర్మిల పాదయాత్రకు గ్రీన్ సిగ్నల్.. కానీ కండీషన్స్ అప్లై

‘యువగళం’ యాత్రలో సొమ్మసిల్లి పడిపోయిన ఎన్టీఆర్..!

నాకు ప్రాణహాని ఉంది.. విడాకులు ఇప్పించండి!

సొంత నియోజకవర్గంలో మంత్రి మల్లారెడ్డికి బిగ్ షాక్

ఢిల్లీ మద్యం కుంభకోణం కేసు… శరత్ చంద్రా రెడ్డికి బెయిల్ మంజూరు…!

మొదలైన ”యువగళం” పాదయాత్ర!

రెడ్ జోన్లో అదానీ కంపెనీ షేర్లు..!

ఫిల్మ్ నగర్

జమునకు టాలీవుడ్‌, రాజకీయ ప్రముఖుల నివాళులు!

జమునకు టాలీవుడ్‌, రాజకీయ ప్రముఖుల నివాళులు!

నాకు ప్రాణహాని ఉంది.. విడాకులు ఇప్పించండి!

నాకు ప్రాణహాని ఉంది.. విడాకులు ఇప్పించండి!

గడుసుతనం.. కొంటెతనం.. ఈ సత్యభామ చిరునామా!

గడుసుతనం.. కొంటెతనం.. ఈ సత్యభామ చిరునామా!

సత్యదేవ్ సినిమా టైటిల్ ఇదే

సత్యదేవ్ సినిమా టైటిల్ ఇదే

వరంగల్ లో వీరయ్య విజయ విహారం

వరంగల్ లో వీరయ్య విజయ విహారం

ఆలనాటి సత్యభామ ఇక లేరు!

ఆలనాటి సత్యభామ ఇక లేరు!

గ్రాండ్ గా వెంకీ సినిమా ఓపెనింగ్

గ్రాండ్ గా వెంకీ సినిమా ఓపెనింగ్

ఎట్టకేలకు స్పందించిన బాలయ్య..!

ఎట్టకేలకు స్పందించిన బాలయ్య..!

Download Tolivelugu App Now

tolivelugu app download

Copyright © 2023 · Tolivelugu.com

About Us | Disclaimer | Contact Us | Feedback | Advertise With Us | Privacy Policy | Sitemap | News Sitemap