విజయవాడ : బెజవాడలో ఆకతాయిలు రెచ్చిపోయారు. బయట పార్క్ చేసిన వాహనాలకు నిప్పెట్టి ధ్వంసం చేశారు. అర్ధరాత్రి దాటిన తర్వాత రెండు ప్రాంతాల్లో ఈ దుశ్చర్యలకు పాల్పడ్డారు. ఆకతాయిల అలజడితో స్థానికులు భయాందోళన చెందారు. బాధితుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు ఆరంభించారు. దుండగుల్ని గుర్తించి వారిని చేసేందుకు రంగంలోకి దిగారు. ఆకతాయి ముఠా బయట పార్కు చేసి వున్న బైకులు, కార్లపై కన్నేసి వాటికి నిప్పుపెట్టింది. శ్రీనగర్ కాలనీలో బిల్డర్ శివశంకర్కు చెందిన కారుకు దుండగులు నిప్పుపెట్టారు. బైకుపై వచ్చిన ముగ్గురు ఆగంతకులు కారుపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. శివశంకర్ ఫిర్యాదుచేయడంతో సత్యనారాయణపురం పోలీసులు కేసు నమోదు చేశారు. సీసీ కెమెరా ఫుటేజీ ఆధారంగా నిందితులను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. సింగ్నగర్ శివాలయం వీధిలో జరిగిన మరో సంఘటనలో రెండు బైకులు, కారుకు దుండగులు నిప్పు పెట్టారు. బైకులు రెండు పూర్తిగా తగలబడిపోగా, కారు ముందు భాగం కాలిపోయింది. పెట్రోల్ దొంగలు ఈ దుశ్చర్యకు పాల్పడి ఉంటారని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు
Tolivelugu Latest Telugu Breaking News » Viral » పార్కు చేసిన వెహికిల్స్కు నిప్పెట్టి తగలపెట్టారు..