• Skip to main content
  • Skip to secondary menu
  • Skip to primary sidebar
tolivelugu-logo-removebg-preview

Tolivelugu తొలివెలుగు

Tolivelugu News provide Latest Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, TG and AP News Headlines Live (తెలుగు తాజా వార్తలు), Telugu News Online (తెలుగు తాజా వార్తలు)

tolivelugu facebook tolivelugu twitter tolivelugu instagram tolivelugu tv subscribe nowtolivelugu-app
  • తెలుగు హోమ్
  • వీడియోస్
  • రాజకీయాలు
  • వేడి వేడిగా
  • ఫిలిం నగర్
  • E-Daily
  • చెప్పండి బాస్
  • ENGLISH
Tolivelugu Latest Telugu Breaking News » Top News » విపక్ష సమైక్యత కల్లే .. బీజేపీకి జైకొట్టిన పీకే

విపక్ష సమైక్యత కల్లే .. బీజేపీకి జైకొట్టిన పీకే

Last Updated: March 21, 2023 at 9:10 am

2024 ఎన్నికలకు ముందు బీజేపీని ఎదుర్కోవడానికి విపక్షాలు ఐక్యం కావడానికి చేసే ప్రయత్నాలు ఫలించబోవని ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ జోస్యం చెప్పారు. ఇది అసలు సాధ్యమయ్యే పని కాదని, అన్ని పార్టీలను, లేదా అందరు లీడర్లను ఒక చోటికి చేర్చినంత మాత్రాన బీజేపీకి ఎదురునిలవ జాలరని ఆయన చెప్పారు. ఈ పార్టీని మీరు ఎదుర్కోవాలంటే దాని బలాన్ని, దాని హిందుత్వ సిధ్ధాంతాన్నీ, జాతీయవాదాన్ని మొదట అవగాహన చేసుకోవలసి ఉంటుందని ఆయన అన్నారు. ‘ఇది మూడంచెల ‘పిల్లర్’.. మీరు వీటిలో కనీసం రెండు పిల్లర్లనైనా దాటలేరు.. అసలు బీజేపీని సవాల్ చేయజాలరు’ అని ఆయన ఓ ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు.

 

BJP will remain powerful for decades, predicts poll strategist Prashant  Kishor | Latest News India - Hindustan Times

.
హిందుత్వ ఐడియాలజీ పై పోరాటం చేయాలంటే గాంధేయవాదులను , అంబేద్కర్ అభిమానులను, సోషలిస్టులను, కమ్యూనిస్టులను ఎదుర్కోవలసి ఉంటుందని, కేవలం ఐడియాలజీ మీద గుడ్డి నమ్మకం ఉన్నంత మాత్రాన సరిపోదని ఆయన పేర్కొన్నారు. విపక్ష కూటమి అంటే ఎవరు ఎవరితో టచ్ లో ఉన్నారని, ఎవరు ఎవరితో లంచ్ చేస్తున్నారని, ఎవరు టీకి ఆహ్వానించారని వంటివన్నీ లెక్క లోకి వస్తున్నాయి.. కానీ ఐడియాలజీలన్నీ కలుస్తాయని నేననుకోను అని పీకే వ్యాఖ్యానించారు.

అసలు బీజేపీని ఓడిస్తారన్న ప్రసక్తే తలెత్తదు అని ఆయన కుండబద్దలు కొట్టారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేబట్టిన భారత్ జోడోయాత్ర ప్రయోజనం ఏమిటని ఆయన ప్రశ్నించారు. దీనివల్ల ఫలితం ఉంటుందని తాను అనుకోనన్నారు.

తన సొంత సిధ్ధాంతం మహాత్మా గాంధీ ఐడియాలజీయేనని స్పష్టం చేసిన ఆయన.. బీహార్ రాష్ట్ర ప్రయోజనాలకు తాను ప్రాధాన్యతనిస్తానని, గాంధీజీ కాంగ్రెస్ సిధ్ధాంతాలను పునరుద్ధరించడానికే ‘జన సూరజ్ యాత్ర’ చేబట్టానని పీకే వివరించారు. కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ మహర్దశ పట్టాలన్నది తన లక్ష్యమైతే, ఎన్నికల్లో ఎలా గెలవాలా అన్నది వారి లక్ష్యమని ఆయన అన్నారు. నా ఆలోచనలను ఒకరకంగా అమలు చేయాలని వారు కోరుకుంటున్నా.. తన ఆలోచనలు వేరని ప్రశాంత్ కిషోర్ పేర్కొన్నారు. బీహార్ లో తన నాలుగు నెలల యాత్ర ప్రజల ఆలోచనా దృక్పథాన్ని తెలుసుకోవడానికి ఉపకరించిందన్నారు.

Primary Sidebar

తాజా వార్తలు

మళ్లీ తాత అయిన ముఖేష్ అంబానీ

కంగన్ వ్యాలీ నేషనల్ పార్క్ లో…రేరెస్ట్ మౌస్ డీర్…!

నకిలీ విత్తనాల విషయంలో జాగ్రత్త వహించండి!

ఓటీటీలకు కీలక ఆదేశాలు జారీ చేసిన కేంద్రం

మహిళపై ఎమ్మెల్యే రెడ్యా నాయక్ ఆగ్రహం

ఎంక్వైరీ స్టార్ట్..! ఆదిత్యకు చుక్కలేనా?

హైదరాబాద్ లో భారీ వర్షం.. మూడు రోజులు బీ అలర్ట్!!

వేంక‌టేశ్వ‌ర స్వామి ఆలయాన్ని సందర్శించిన సీఎం కేసీఆర్

బీజేపీ లేకపోతే..తెలంగాణ వచ్చేది కాదు!

ఇకనైనా చర్యలు తీసుకోండి.. మహిళా రెజ్లర్ల పోరాటంపై కవిత

భోళాశంకర్ మేనియా షురూ

చాయ్ బిస్కెట్.. మరో బంపరాఫర్

ఫిల్మ్ నగర్

Bholaa Shankar mania will start soon

భోళాశంకర్ మేనియా షురూ

Mem famous for 99 rupees only

చాయ్ బిస్కెట్.. మరో బంపరాఫర్

Srikanth Addala new movie details

ఎన్నాళ్లకెన్నాళ్లకు అడ్డాల

Allu Sirish as BUDDy

బడ్డీగా రాబోతున్న అల్లు శిరీష్

Teja hopes on Ustad Bhagat Singh

పవన్ సినిమాకు తేజ రివ్యూ

లేటెస్ట్ ట్రెండ్ గా...లేటు వయసు ప్రేమ పెళ్లిళ్లు ...!

లేటెస్ట్ ట్రెండ్ గా…లేటు వయసు ప్రేమ పెళ్లిళ్లు …!

29 ఏళ్ల అమ్మాయి.. 83 ఏళ్ల అబ్బాయి!!

29 ఏళ్ల అమ్మాయి.. 83 ఏళ్ల అబ్బాయి!!

ప్రమాదానికి గురైన పుష్ప-2 టీమ్..పలువురు నటులకు గాయాలు..!

ప్రమాదానికి గురైన పుష్ప-2 టీమ్..పలువురు నటులకు గాయాలు..!

Download Tolivelugu App Now

tolivelugu app download

Copyright © 2023 · Tolivelugu.com

About Us | Disclaimer | Contact Us | Feedback | Advertise With Us | Privacy Policy | Sitemap | News Sitemap