రెండు తెలుగు రాష్ట్రాలను శాసిస్తున్న, కాంట్రాక్టర్ మెఘా కంపెనీ పై, దేశ వ్యాప్తంగా ఐటి దాడులు జరుగుతుండటం పెను సంచలనంగా మారింది. మెఘా కృష్ణా రెడ్డి అటు కేసిఆర్ కి, ఇటు జగన్ మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు. కాళేశ్వరం ప్రాజెక్ట్ కాని, మొన్న పోలవరంలో సింగల్ టెండర్ వేసి, ప్రాజెక్ట్ తీసుకోవటం కాని, ఇలా ప్రతి దాంట్లో మెఘా ఉంటుంది. అలాగే ఎన్నికల సమయంలో, మెఘా నుంచి, పెద్దిరెడ్డి కంపెనీకి అధికంగా నిధులు వచ్చాయని, తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే.
రేపు కేసీఆర్ చేపట్టబోయే గోదావరి- కృష్ణా అనుసంధానం కూడా మెఘాకే ఇస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. తెలంగాణాలో ఎలక్ట్రిక్ బస్సులు ఆర్టీసీకి అద్దెకు ఇస్తున్న మెఘా, ఆంధ్రప్రదేశ్ లో కూడా మెఘా కంపెనీకే ఎలక్ట్రిక్ బస్సుల కాంట్రాక్టు ఇస్తున్నారు. ఇదే అంశాన్ని తొలివెలుగు ద్వారా మీడియా లెజెండ్ రవిప్రకాశ్ బహిర్గతం చేశారు. ప్రాజెక్ట్ల అంచనాలు పెంచేలా చేయటం, ఆ కాంట్రాక్ట్ తమకే దక్కేలా చూసుకోవటం… ఎక్కడ ఎలా సంపాదిస్తున్నారో బయటపెట్టారు. అందుకే అక్రమ కేసులతో రవిప్రకాశ్ను జైలుకు కూడా పంపించారు.
ఒక పక్క పోలవరం రివర్స్ టెండరింగ్ కు వెళ్ళ వద్దు అని కేంద్రం అంటున్నా, జగన్ వెళ్లి… మేఘాకు కాంట్రాక్టు ఇవ్వటంతో కేంద్రం గుర్రుగా ఉంది. వీటి అన్నింటి నేపథ్యంలో మెఘా ఇంజినీరింగ్ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ కృష్ణారెడ్డి నివాసంతో పాటుగా, ఆయన నివాసం, కార్యాలయాల్లో ఏకకాలంలో ఐటి దాడులు కొనసాగుతోన్నాయి.
ఆదాయపు పన్ను శాఖకు చెందిన ఇన్వెస్టిగేషన్ వింగ్ ఈ సోదాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే కొంత మంది జాతీయ మీడియా రిపోర్ట్ చేస్తున్న ప్రకారం.. ఈ సోదాల్లో భారీగా అక్రమ లావాదేవీలు బయట పడ్డాయని, పలు కీలక డాక్యుమెంట్లు కూడా స్వాధీనం చేసుకున్నారని, ఫేక్ బిల్లులు పెట్టి వేల కోట్లు కొల్లగొట్టినట్టు తేలిందని చెప్తున్నారు. మెఘా కంపెనీలో ఇరు రాష్ట్రాల ప్రముఖులు బినామీలుగా ఉన్నారని, రెండు తెలుగు రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో మెఘానే ఎన్నికల ఫండింగ్ చేసిందనే విమర్శలున్నాయి. అయితే ఈ ఐటి దాడులు రాజకీయంగా కూడా చూడాలని విశ్లేషకులు అంటున్నారు. కేసిఆర్, జగన్, బీజేపీ పై ఉమ్మడిగా రాజకీయ పోరాటం చెయ్యాలని నిర్ణయం తీసుకున్నారనే సమాచారం రావటంతో పాటు, కేసీఆర్-జగన్ల అండతో… రవిప్రకాశ్లాంటి వారిని ఇబ్బందులకు గురిచేయటంపై బీజేపీ పెద్దలు గుర్రుగా ఉన్నారు. ప్రజల పక్షాన నిలబడే వారిని ఇలా జైల్లో పెట్టుకుంటూ పోతే ఎలా, బీజేపీ రెండు రాష్ట్రాల్లోనూ ప్రజా సమస్యలపై పోరాటం చేయాలనుకుంటున్న దశలో అక్రమ అరెస్ట్లపై గళం విప్పటంతో పాటు, కేంద్ర ప్రభుత్వం తరుపున ఉక్కుపాదం మోపాలని బీజేపీ అధిష్టానం డిసైడ్ అయినట్లు కనపడుతోంది.
అందుకే ఈ రోజు జగన్ మోహన్ రెడ్డి, హోం మంత్రి అమిత్ షా తో భేటీ కావాల్సి ఉంది. అయితే ఈ రోజు ఈ అపాయింట్మెంట్ కాన్సిల్ అయ్యింది. మొన్న ఢిల్లీ వెళ్ళినప్పుడు కూడా అమిత్ షా ని కలిసే ప్రయత్నం చేసినా కుదరలేదు. అయితే ఇప్పుడు అపాయింట్మెంట్ ఇచ్చి కూడా రద్దు చెయ్యటం, మేఘా పై ఐటి రైడ్స్ చూస్తుంటే ఎన్నికల ముందు మాకు జరిగిన సీన్స్ గుర్తొస్తున్నాయంటోంది తెలుగుదేశం పార్టీ.