• Skip to main content
  • Skip to secondary menu
  • Skip to primary sidebar
Tolivelugu తొలివెలుగు – Latest Telugu Breaking News

Tolivelugu తొలివెలుగు - Latest Telugu Breaking News

Tolivelugu News provide Latest Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, TG and AP News Headlines Live (తెలుగు తాజా వార్తలు), Telugu News Online (తెలుగు తాజా వార్తలు)

tolivelugu facebook tolivelugu twitter tolivelugu instagram tolivelugu tv subscribe nowtolivelugu-app
  • తెలుగు హోమ్
  • వీడియోస్
  • రాజకీయాలు
  • వేడి వేడిగా
  • ఫిలిం నగర్
  • E-Daily
  • చెప్పండి బాస్
  • ENGLISH
Tolivelugu Latest Telugu Breaking News » రాజకీయాలు » రాష్ట్రపతి ఎన్నిక.. బీజేపీ ధీమా!

రాష్ట్రపతి ఎన్నిక.. బీజేపీ ధీమా!

Last Updated: June 13, 2022 at 8:25 am

– ఏకగ్రీవం కోసం నడ్డా, రాజ్ నాథ్ ప్రయత్నాలు
– విపక్షాలతో చర్చలకు బీజేపీ కసరత్తు

రాష్ట్రపతి ఎన్నిక నేపథ్యంలో దేశవ్యాప్తంగా రాజకీయాలు హీటెక్కాయి. ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం కాంగ్రెస్ .. దేశ‌వ్యాప్తంగా ఉన్న‌ ప్ర‌తిప‌క్ష పార్టీల‌ను ఏకం చేయాల‌ని భావిస్తోంది. మరోవైపు బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ నేతృత్వంలో ఈ నెల 15న సమావేశం కానున్నాయి. వాటిని ఏకం చేసేందుకు మమత 15మంది కీలక నేతలకు లేఖలు పంపారు. దీంతో బీజేపీ రాష్ట్రపతి ఎన్నికను ఏకగ్రీవం చేసే దిశగా స్కెచ్ వేసింది. విపక్షాలతో ఈ విషయంపై చర్చించేందుకు పావులు కదుపుతోంది.

రాష్ట్రపతి ఎన్నికల నేపథ్యంలో వివిధ పార్టీలతో సంప్రదింపులు జరిపేందుకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్రమంత్రి రాజ్ నాథ్ సింగ్ లను రంగంలోకి దిగారు. దీనికి సంబంధించి బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ ఈ ప్రకటన చేశారు. రాష్ట్రపతి అభ్యర్థిపై ఏకాభిప్రాయ సాధనే లక్ష్యంగా అధికార ఎన్​డీఏలోని భాగస్వామ్యపక్షాలు, విపక్ష పార్టీలతో నడ్డా, రాజ్ నాథ్ చర్చలు జరపనున్నారు.

ప్రస్తుతం జేడీయూ, అప్నాదళ్, అన్నాడీఎంకే, ఎల్​జేపీ, జేజేపీ, ఈశాన్య రాష్ట్ర పార్టీలైన ఎన్‌పీపీ, ఎన్​పీఫ్​, ఏజీపీ పార్టీలు ఎన్​డీఏ భాగస్వామ్య పక్షాలుగా ఉన్నాయి. స్వతంత్రంగా ఉంటున్న వైసీపీ, బీజేడీ వంటి పార్టీలతోనూ నడ్డా, రాజ్​నాథ్ సంప్రదింపులు జరపనున్నారు. ప్రస్తుత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పదవీకాలం జూలై 24వ తేదీతో ముగియనుంది. రాష్ట్రపతి పదవికి ఒకరి కంటే ఎక్కువ మంది నామినేట్ చేసినట్లయితే.. కొత్త అధ్యక్షుడి కోసం జూలై 18న ఓటింగ్ నిర్వహించి, జూలై 21న ఓట్ల లెక్కింపు జరుగుతుంది.

ఈ ఎన్నికల్లో 4,809 మంది ఓటర్లు ఉండగా, వారిలో 776 మంది ఎంపీలు, 4,033 మంది ఎమ్మెల్యేలు ఉండనున్నారు. వీరిలో 223 మంది రాజ్యసభ సభ్యులు, 543 మంది లోక్‌సభ సభ్యులు ఉన్నారు. అయితే, రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీ ఎవరిని ఎంపిక చేస్తుందనే విషయంపై ఉత్కంఠ నెలకొంది.

tolivelugu news - follow on google news
tolivelugu app download


Primary Sidebar

తాజా వార్తలు

సరిహద్దుల్లో మేడ్ ఇన్ ఇండియా ఐఎపీవీలు… వీడియోలు వైరల్

శివసేన కీలక నిర్ణయం…. వారికి నోటీసులు…!

వరద బీభత్సం… 118కి చేరిన మృతుల సంఖ్య

రెబెల్ ఎమ్మెల్యేలకు మరో షాక్

మోడీ టార్గెట్‌ ఏంటి? కేసీఆర్‌ తో దోస్తీనా? కుస్తీనా?

హైదరాబాద్ వేదిక.. కాషాయ వేడుక..

టీచ‌ర్ల‌కు రాష్ట్ర ప్ర‌భుత్వం షాక్..!

మై డియర్ లవ్.. నాక్కూడా డాన్స్ నేర్పించవా..?

కూల్చివేతల ప్ర‌భుత్వానికి మూడేళ్లు..!

నెక్ట్స్‌ ఎవరు? కాంగ్రెస్‌ కు టచ్‌ లో ఉన్నదెవరు?

కమల దళం బిజీబిజీ..కేసీఆర్‌ పై తరుణ్‌ చుగ్‌ ఫైర్‌

48 గంట‌లు డెడ్ లైన్.. సంచ‌ల‌నంగా మారిన సెల్ఫీ వీడియో..!

ఫిల్మ్ నగర్

మై డియర్ లవ్.. నాక్కూడా డాన్స్ నేర్పించవా..?

మై డియర్ లవ్.. నాక్కూడా డాన్స్ నేర్పించవా..?

రిలీజ్ కానీ సౌందర్య సినిమా! ఇప్పటికీ రామోజీ ఫిలిం సిటీ ల్యాబ్ లో కాపీ

రిలీజ్ కానీ సౌందర్య సినిమా! ఇప్పటికీ రామోజీ ఫిలిం సిటీ ల్యాబ్ లో కాపీ

పఠాన్‌ ఫస్ట్‌ లుక్‌.. బాద్‌ షా ఆగయా!

పఠాన్‌ ఫస్ట్‌ లుక్‌.. బాద్‌ షా ఆగయా!

టాలీవుడ్ లో ఈ స్టార్స్ వల్లే వారంతా కనుమరుగైపోయారా!!

టాలీవుడ్ లో ఈ స్టార్స్ వల్లే వారంతా కనుమరుగైపోయారా!!

జూనియర్ ఎన్టీఆర్ ఇన్ని అవమానాలు పడ్డాడా!?

జూనియర్ ఎన్టీఆర్ ఇన్ని అవమానాలు పడ్డాడా!?

థ్యాంక్యూ సినిమా రిలీజ్.. రెండు వారాలు వాయిదా..!

థ్యాంక్యూ సినిమా రిలీజ్.. రెండు వారాలు వాయిదా..!

హీరోయిన్ విషయం లో రాజమౌళి మహేష్ ల మధ్య విబేధాలు...క్లారిటీ!!

హీరోయిన్ విషయం లో రాజమౌళి మహేష్ ల మధ్య విబేధాలు…క్లారిటీ!!

బాల‌య్య బాబుకు క‌రోనా..!

బాల‌య్య బాబుకు క‌రోనా..!

Download Tolivelugu App Now

tolivelugu app download

Copyright © 2022 · Tolivelugu.com

About Us | Disclaimer | Contact Us | Feedback | Advertise With Us | Privacy Policy | Sitemap | News Sitemap

ToliVelugu News provide Latest Telugu Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, Telangana and AP News Headlines Live, Latest Telugu News Online (తెలుగు తాజా వార్తలు)