• Skip to main content
  • Skip to secondary menu
  • Skip to primary sidebar
Tolivelugu తొలివెలుగు – Latest Telugu Breaking News

Tolivelugu తొలివెలుగు - Latest Telugu Breaking News

Tolivelugu News provide Latest Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, TG and AP News Headlines Live (తెలుగు తాజా వార్తలు), Telugu News Online (తెలుగు తాజా వార్తలు)

tolivelugu facebook tolivelugu twitter tolivelugu instagram tolivelugu tv subscribe nowtolivelugu-app
  • తెలుగు హోమ్
  • వీడియోస్
  • రాజకీయాలు
  • వేడి వేడిగా
  • ఫిలిం నగర్
  • E-Daily
  • చెప్పండి బాస్
  • ENGLISH
Tolivelugu Latest Telugu Breaking News » Scrolling » రామ రామ.. బీజేపీ, కాంగ్రెస్ కొత్త పంచాయితీ!

రామ రామ.. బీజేపీ, కాంగ్రెస్ కొత్త పంచాయితీ!

Last Updated: August 6, 2022 at 11:20 am

కేంద్రంలోని బీజేపీ సర్కార్ కు వ్యతిరేకంగా కాంగ్రెస్ తరచూ నిరసనలు కొనసాగిస్తోంది. ముఖ్యంగా ధరల పెంపు విషయంలో దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగిస్తోంది. కానీ.. శుక్రవారం చేసిన నిరసన కార్యక్రమాలు రెండు పార్టీల మధ్య కొత్త పంచాయితీకి దారితీశాయి. దేశంలో ధరల పెరుగుదలను నిరసిస్తూ.. ఢిల్లీలో కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ, ఇతర నేతలు నల్ల దుస్తులు ధరించి ధర్నా చేశారు. ఆ సమయంలో కాసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇదంతా మీడియాలో హైలెట్ అయింది.

అయితే.. కేంద్రమంత్రి అమిత్ షా ఓ కొత్త అనుమానాన్ని వ్యక్తం చేశారు. ఎప్పుడూ ధర్నాలు చేస్తారు గానీ.. ఆగస్టు 5వ తేదీనే నిరసన తెలపడం.. అది కూడా నల్లదుస్తులు ధరించి మరీ చేయడానికి అసలు కారణం వేరే ఉందన్నారు. ఆగస్టు 5న ప్రధాని మోడీ అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి భూమి పూజ చేశారు. దానికి వ్యతిరేకం అనే చెప్పే ఉద్దేశంలో భాగంగానే కాంగ్రెస్ నిరసన చేపట్టిందని షా విమర్శించారు. ‘‘కాంగ్రెస్ ఎందుకు ప్రత్యేకంగా నిరసన చేపట్టింది? ప్రధాని మోడీ ఇదే రోజు అయోధ్య రామ మందిరానికి భూమి పూజ చేశారు. దీనికి వ్యతిరేకం అని చెప్పేందుకు, బుజ్జగింపు రాజకీయాలు చేసేందుకే ఈ నిరసన చేపట్టింది. దీని ద్వారా వాళ్లు ఒక స్పష్టమైన సందేశాన్ని ఇవ్వాలనుకుంటున్నారు’’ అంటూ ప్రశ్నించారు హోంమంత్రి.

షా ట్వీట్ పై కాంగ్రెస్ నేతలు భగ్గుమంటున్నారు. దీనిపై జైరాం రమేష్ స్పందిస్తూ..‘‘ధరల పెరుగుదల, నిరుద్యోగం, జీఎస్టీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ చేపట్టిన ప్రజాస్వామ్య నిరసనలను దారి మళ్లించడానికే ఇదంతా. ప్రజల దృష్టి మరల్చేందుకే రాముడు అంశం తెరపైకి తెచ్చారు హోంమంత్రి. ఇటువంటి బూటకపు వాదనలను పుట్టించడంలో మీకు మీరే సాటి.’’ అంటూ మండిపడ్డారు.

అమిత్ షా వ్యాఖ్యలపై ప్రియాంకా గాంధీ కూడా స్పందించారు. దేశవ్యాప్తంగా పేదలు, మధ్యతరగతి ప్రజలపై ద్రవ్యోల్బణం భారం పడకుండా పోరాడడమే రాముడు చూపిన మార్గమని సెటైర్ వేశారు. ‘‘ధరలు పెంచి బలహీనులను బాధపెట్టేవాడు శ్రీరామునిపై దాడి చేస్తాడు. దానికి వ్యతిరేకంగా ఉద్యమించే వారితో తప్పుడు మాటలు మాట్లాడేవాడు లోక్‌ నాయక్‌ రామ్‌ ని, భారత ప్రజలను అవమానిస్తాడు’’ అంటూ ట్వీట్ చేశారు. ఈ అంశం చుట్టూ ఇప్పుడు బీజేపీ, కాంగ్రెస్ మధ్య డైలాగ్ వార్ కొనసాగుతోంది. యూపీ సీఎం యోగి కాంగ్రెస్ పై విరుచుకుపడ్డారు.

Primary Sidebar

తాజా వార్తలు

బ్లాక్ బస్టర్ మిస్సయిన నాని

మ‌రెవ‌రికి ఇలా కాకూడ‌దు!!

న్యాయవాదికి న్యూడ్ కాల్స్.. ఆపై బెదిరింపులు

రూటు మార్చిన రామ్ చరణ్.. నయా ప్లాన్స్

మరోసారి మాస్ Vs క్లాస్

త‌గ్గిస్తున్నాం.. ఎక్కుతారా..?

బండి రచ్చబండలో.. రచ్చ రచ్చ!

హాట్ హాట్ గా..కేబినెట్

టీటీడీ సభ్యుడే..కానీ..!జాలీ,దయా లేని కాలయముడు

కేబినెట్‌ లో కీలక అంశాలపై చర్చ!

20 మంది మృతి.. 15 మంది గల్లంతు!

రేపు ఎంసెట్‌ ఫలితాలు

ఫిల్మ్ నగర్

బ్లాక్ బస్టర్ మిస్సయిన నాని

బ్లాక్ బస్టర్ మిస్సయిన నాని

రూటు మార్చిన రామ్ చరణ్.. నయా ప్లాన్స్

రూటు మార్చిన రామ్ చరణ్.. నయా ప్లాన్స్

మరోసారి మాస్ Vs క్లాస్

మరోసారి మాస్ Vs క్లాస్

హీరోయిన్ ను చూస్తే పంత్ కు జాలేస్తుందంటా...

హీరోయిన్ ను చూస్తే పంత్ కు జాలేస్తుందంటా…

విశాల్ ను వెంటాడుతున్న ప్రమాదాలు.. మరోసారి ఆస్పత్రిపాలు!

విశాల్ ను వెంటాడుతున్న ప్రమాదాలు.. మరోసారి ఆస్పత్రిపాలు!

v-v-vinayak

కళ్యాణ్ రామ్ కు వినాయక్ థాంక్స్ ఎందుకు చెప్పాడు?

ఎక్స్ క్లూజివ్.. సైలెంట్ గా స్టార్ట్ అయిన పవన్ సినిమా

ఎక్స్ క్లూజివ్.. సైలెంట్ గా స్టార్ట్ అయిన పవన్ సినిమా

స్వాతిముత్యం తట్టుకోగలడా?

స్వాతిముత్యం తట్టుకోగలడా?

Download Tolivelugu App Now

tolivelugu app download

Copyright © 2022 · Tolivelugu.com

About Us | Disclaimer | Contact Us | Feedback | Advertise With Us | Privacy Policy | Sitemap | News Sitemap

ToliVelugu News provide Latest Telugu Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, Telangana and AP News Headlines Live, Latest Telugu News Online (తెలుగు తాజా వార్తలు)